నందమూరి తారక రామారావు బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కి, సంక్రాంతి కానుకగా మొదటి పార్టు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం తాజాగా విడుదలయిన విషయం తెల్సిందే.పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం పర్వాలేదు అన్నట్టుగా కలెక్షన్లు రాబడుతోంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటించగా, ఆయన సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటిమణి విద్యాబాలన్ నటించింది.ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు క్రిష్ తాజాగా ఓ ఇంటర్య్వూలో మట్లాడాడు.
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది.అయితే ఈ చిత్రం ఎప్పటితో ముగుస్తుంది అని క్రిష్ను ప్రశ్నించగా, ఈ చిత్రం ఎక్కడితో ముగుస్తుంది అని నేను ఎప్పడం కరెక్ట్ కాదు.ఎందకంటే నిర్మాత బాలకృష్ణ మరో పార్టును కూడా ప్లాన్ చేద్దాం అంటే అందుకు తాను సిద్దంగా ఉన్నానని, వస్తే ‘ఎన్టీఆర్ 3’ కూడా వచ్చే అవకాశం ఉందని క్లారిటీగా చెప్పాడు.దాంతో ఎన్టీఆర్ మూడో పార్టు కూడా ఉంటుంది అని నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు.
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రంలో లోపాలు చూపించారా? అనే ప్రశ్నకు ఆయన జీవితంలో ఎంత వెదికినా కూడా నాకు లోపాలు ఎక్కడ కనబడలేదు.ఎత్తులే తప్ప పల్లాలు లేని జీవితం ఆయనది.రామాయణంలో రాముడిలా ఎన్టీఆర్ జీవితం ఉంటుందని క్రిష్ చెప్పుకొచ్చాడు.ఎన్టీఆర్ యొక్క ఆవేశం, మొండితనం, వాటి వల్ల చేసిన కొన్ని లోపాలు అన్నీ కూడా రెండో పార్టులో చూపించాం అని, ‘మహానటి’ చిత్రం లాగా ‘ఎన్టీఆర్’ ఉండదు.
ఎందకంటే సావిత్రి గారిది చాలా భిన్నమైన జీవితం, కానీ ఎన్టీఆర్ జీవితం మాత్రం చాలా సాఫీగా సాగిపోయింది అందుకే అలాగే తీశాం, ‘మహానటి’లా ‘ఎన్టీఆర్’ ఉండాలంటే కుదరదు కదా అని క్రిష్ చెప్పుకొచ్చాడు.