సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ‘ఎఫ్2’కు పట్టం కట్టినట్లుగానే కనిపిస్తుంది.అన్నింటికంటే చివరగా వచ్చిన ఎఫ్2 చిత్రం మంచి వసూళ్లతో బిగినింగ్ చేసింది.
వెంకటేష్ మరియు వరుణ్ తేజ్లు కలిసి నటించిన ఈ చిత్రాన్ని అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఆశించినట్లుగానే ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో వెంకటేష్ నటన పీక్స్కు చేరింది.వెంకీ సినిమా మొత్తాన్ని నడిపించాడు అంటూ అభిమానులు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక వెంకీకి మంచి భాగస్వామ్యంను వరుణ్ అందించాడు.
వీరిద్దరు ఈ చిత్రం స్థాయిని అమాంతం పెంచేశారు.మరి ఈ చిత్రం కోసం వీరిద్దరు తీసుకున్న పారితోషికం ఎంత అనే విషయంపై రకరకాలుగా చర్చ జరుగుతుంది.అంతా ఇంతా అంటూ పెద్దగా ప్రచారం చేస్తున్నారు.
కాని ఇది దిల్ రాజు సినిమా, ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు.అంతకు ఒప్పుకుంటేనే సినిమా ప్రారంభం అవుతుంది.
సినిమా విడుదలైన తర్వాత లాభాల్లో వాటలు అటువంటివి కూడా ఏమీ ఉండవు.ఈ చిత్రం కోసం ముందుగానే వెంకీకి దిల్రాజు అయిదు కోట్ల పారితోషికంను ముట్టజెప్పినట్లుగా తెలుస్తోంది.
ఈమద్య కాలంలో వెంకీకి పెద్దగా సక్సెస్లు లేవు, అయినా కూడా ఇంత భారీ పారితోషికం ఆశ్చర్యమే.
ఇక వరుణ్ తేజ్కు ఈ చిత్రంలో నటించినందుకు గాను 3.5 కోట్ల పారితోషికం అందినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం వరుణ్ తేజ్ క్రేజ్ బాగానే ఉంది.
గత చిత్రాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి.ఆ కారణంగానే 3.5 కోట్లు పారితోషికం అందుకున్నాడు.ఇక వీరిద్దరికి జోడీగా నటించిన తమన్నాకు 1.2 కోట్ల పారితోషికం ఇవ్వగా, మెహ్రీన్కు మాత్రం 75 లక్షలకు ఫిక్స్ చేశారు.ఇక సినిమాలో ఇతరులు పాతికల లక్షల లోపు పారితోషికాలకు పని చేసిన వారే.
సింపుల్గా దర్శకుడు అనీల్ రావిపూడి 25 కోట్లలోపు బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.ఈజీగా 50 కోట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది.అంటే రాజుగారికి ఏకంగా పాతిక కోట్ల లాభం వచ్చే అవకాశం కనిపిస్తుంది.
తాజా వార్తలు