చిత్తూరు టీడీపీ ఎంపీ శివ ప్రసాద్ స్టయిలే వేరు.ఏపీ సమస్యలకు సంబంధించి పార్లమెంట్ దగ్గర ఎటువంటి నిరసన కార్యక్రమం చేయాలన్నా… అందరిలా కాకుండా వినూత్న వేషధారణతో సమస్యలని ప్రస్తావిస్తూ… కేంద్రాన్ని నిలదీస్తూ ఉంటాడు.
దీంతో ఆయన జాతీయ మీడియా లో కూడా ఎక్కువగా ఫోకస్ అవుతుంటాడు.ఆయనకు నాటకరంగంలోనూ… సినీ రంగంలోనూ… ప్రవేశం ఉండడంతో ఏ వేషం వేసినా అందులో పరకాయ ప్రవేశం చేసేస్తుంటాడు.
ఇక విషయానికి వస్తే… ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు చేపట్టిన నిరసనలు ఇంకా… కొనసాగుతున్నాయి.పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు.ఏపీకి ప్రత్యేక హోదాతో సహా.విభజన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.ఈ నిరసనలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్.శుక్రవారం మహాశివుని రూపంలో పార్లమెంట్ ఆవరణలో ప్రత్యక్షమయ్యారు.చేతిలో త్రిశూలం, మెడలో నాగుపాము.శిరస్సున గంగమ్మ తల్లితో తిరుగుతూ… సందడి చేశారు.
ఆ పక్కనే అన్నాడీఎంకే ఎంపీలు కూడా నిరసనలు తెలుపుతుంటే.వారి దగ్గరకి వెళ్లి వారితో పాటూ నిరసనల్లో పాల్గొన్నారు.
శివప్రసాద్ గతంలో స్కూల్ పిల్లాడిగా, నారద మహర్షిగా వివిధ వేషాల్లో పార్లమెంట్ దగ్గర అందరికి వినోదం పంచారు.