శ్రీదేవి గారి మరణం తరువాత చలన చిత్రం మూగబోయింది కొన్ని రోజులు.ఆమె లేని లోటు ఎవ్వరు తీర్చలేరు అని అందరూ అన్నారు, అది నిజమే.
కానీ ఇప్పుడు శ్రీదేవి గారిని మైమరిపించేలా ఆమె కూతురు జాహ్నవి కనిపిస్తుంది.
శ్రీదేవి గారు బ్రతికున్నంత వరకు ఆమె కూతుళ్ళ తో వస్త్రధారణ విషయం లో పోటీ పడ్డారు, ఆమె వయసు గురించి ఆలోచించేవారు కాదు.ఇటీవలే జాహ్నవి కపూర్ మొదటి సినిమా విడుదల అయ్యింది హిందీ లో, ఈ సినిమాకు విశేషమైన స్పందన వచ్చింది.
అందాల ఆరబోతలో శ్రీ దేవి గారినే మించిపోయింది జాహ్నవి కపూర్ అని బాలీవుడ్ జనాలు అందరూ అంటున్నారు, ఇటీవల ఒక మ్యాగజైన్ కి ఆమె ఇచ్చిన ఫోటోషూట్ చూసి అందరి కళ్ళు తిరిగాయి, ఆ రేంజ్ లో ఆమె తన అందాన్ని ఆరబోసింది మరి.రానున్న రోజుల్లో స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు జాహ్నవి కపూర్ లో పుష్కలంగా కనిపిస్తున్నాయి అని చాలా మంది చెబుతున్న మాట.దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో కూడా నటించాలి అని జాహ్నవి కోరిక, మరి తెలుగు నాట ఎప్పుడు అరంగేట్రం చేస్తుందో చూడాలి.
ఫంక్షన్స్ లో కూడా జాహ్నవి కపూర్ తన అందాల ప్రదర్శన ఆపట్లేదు.దీపికా రణవీర్ రిసెప్షన్ కి జాహ్నవి కపూర్ ఎ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.ఆమె తన వస్త్రధారణ తో యూత్ మతి పోగొడుతున్నారు.