మెగాహీరో వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’ చిత్ర ప్రీ రిలీజ్ వేడక తాజాగా జరిగింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాపవర్స్టార్ రామ్ చరణ్ హాజరయ్యాడు.
సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించింది.ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మాట్లాడిన లావణ్య త్రిపాఠి వేదికపై అందరికి ధన్యవాదాలు తెలిపింది.
అయితే ముఖ్య అతిథిగా వచ్చిన రామ్చరణ్కు ధన్యవాదాలు తెలపడం మరిచినట్టుంది.ఇక ఈ అమ్మడిపై మెగా అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.దాంతో తాజాగా లావణ్య రామ్చరణ్కు క్షమాపణ చెబుతూ కంగారులో మరిచిపోయాను అని, అందుకు సారీ చెబుతూ, ఈ ఈవెంట్కు మీరు వచ్చింనందుకు కొత్త జోష్ నిండి, మా స్థైర్యాన్ని మరింత పెంచింది అని ట్వీట్ చేసింది.
కంగారులో రామ్చరణ్కు ధన్యవాదాలు తెపడం మరిచిపోవడం నన్ను చాలా బాదపెట్టింది, అందుకు వెరీ సారీ అని, వేడుకకు విచ్చేసినందుకు థాంక్స్ అంటూ లావణ్య ట్వీట్ చేసింది.ఎంత చేసినా కూడా మెగా అభిమానులు ఈ అమ్మడిపై గుర్రుగానే ఉన్నారు.అతిథిగా వచ్చిన సమయంలో మర్చిపోయి, ఇప్పుడు వెళ్లి సారీ చెబితే ఏముంటుంది అని అభిమానులు లావణ్యపై మండిపడుతున్నారు.