ఈమద్య కాలంలో జర్నలిజం కొత్త పుంతలు తొక్కుతోంది.ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు టీవీ జర్నలిస్ట్లు చేస్తున్న ప్రయోగాలు ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
ఇండియాతో పాటు ప్రపంచ దేశాలన్నింట్లో కూడా భారీ ఎత్తున మీడియాలో సంచలన మార్పులు వచ్చాయి.
వార్త చానెల్స్ పోటీని తట్టుకునేందుకు కొత్త కొత్త పద్దతిలో న్యూస్ ను ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.తాజాగా పాకిస్తాన్కు చెందిన ఒక టీవీ జర్నలిస్ట్ చేసిన ప్రయత్నం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నవ్వులు పూయిస్తుంది.
పాకిస్తాన్ లాహోర్లో పెద్ద ఎత్తున గాడిదల బిజినెస్ జరుగుతుంది.ప్రపంచంలో మూడవ స్థానంను పాకిస్తాన్ గాడిదల బిజినెస్లో నిలిచింది.ఈ సందర్బంగా లాహోర్లో ఒక టీవీ జర్నలిస్ట్ అందుకు సంబంధించిన ఒక రిపోర్ట్ను ఇవ్వాలని వెళ్లాడు.
అక్కడ గాడిదల బిజినెస్ ఎలా జరుగుతుంది, గాడిదల సంరక్షణ ఎలా చేస్తున్నారు అనే పలు విషయాల గురించి అక్కడ చర్చకు వచ్చింది.పలు ఆసక్తికర విషయాలను ఆయన ప్రేక్షకులకు తెలియజేశాడు.
ఆ సమయంలోనే ఆయన గాడిదపై ఎక్కి చివర్లో తన రిపోర్ట్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.ఆ సమయంలోనే గాడిద అటు ఇటుగా ఎగరడంతో అతడు కింద పడ్డాడు.గాయాలు అయితే పెద్దగా ఏం కాలేదు కాని గాడిదను ఎక్కి రిపోర్టింగ్ చేయాలనుకున్న అతడి ఆలోచనకు పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి.కొందరు జంతు ప్రేమికులు అతడిపై దుమ్మెత్తి పోస్తుంటే మరి కొందరు మాత్రం మీమ్స్ మీద మీమ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.