టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న ఎమ్యెల్యే స్థానాలు 88 .ఇప్పుడు ఆ సంఖ్య 89 కి చేరింది.
టీఆర్ఎస్ టికెట్ ఆశించి అది దక్కకపోవడంతో.రామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి సోమవరపు సత్యనారయణపై చందర్ విజయం సాధించారు.
రేపు (గురువారం) మధ్యాహ్నం కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.టీఆర్ఎస్ తనకు మాతృసంస్థ అని అన్నారు.కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చందర్ తెలిపారు.
తాజా వార్తలు