టీనేజ్లో ఉన్న సమయంలో ఏదైతే అనుకుంటారో అదే చేయాలని, ఎవరి మాట వినొద్దని అనుకుంటూ ఉంటారు.అంతా నాకు తెలుసు, నాకంటే ఇంకా ఎవరికి బాగా తెలియదు అనుకుంటారు.
ఆ వయస్సులోనే ఎక్కువ మంది తప్పటడుగులు వేస్తారు.ఒక వైపు నుండే ఆలోచించడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా ప్రేమ విషయంలో టీనేజర్స్ చాలా మంది తప్పటడుగులు వేసి, జీవితాంతం బాధపడతారు.జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నామనే విషయం వారికి తెలియదు, ఆ విషయం తెలిసే సమయానికి వారి జీవితం నాశనం అవుతుంది.
తమిళనాడు మధురైకి చెందిన గౌతమి కృష్ణన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.ప్రేమ మోజులో తల్లిదండ్రులను ఎదిరించింది.వారు వద్దన్నా, కదన్నా కూడా అతడిని పెళ్లి చేసుకుంది.పెళ్లి చేసుకున్న తర్వాత అతడి నిజ స్వరూపం తెలిసి కన్నీరు మున్నీరు అయ్యింది.కన్న తల్లిదండ్రులు చెప్పినట్లుగా వినక పోవడంతో తన జీవితం నాశనం అయ్యిందని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో నా జీవితాన్ని నా చేతులతో నాశనం చేసుకున్నాను అంటూ గౌతమి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు అయిన గౌతమి ఇంజనీరింగ్ చదువుతుంది.ఆ సమయంలోనే ఆమెకు వైభవ్ అనే ఒక కారు మెకానిక్ పరిచయం అయ్యాడు.
ఆయనతో పరిచయం ప్రేమగా మారింది.అతడు చూపించిన ప్రేమ, ఆమె పట్ల అతడు చూపించే వాత్సల్యంతో ఆమె కరిగి పోయింది.
భారీగా బహుమతులు ఇవ్వడంతో పాటు, సర్ప్రైజ్ పార్టీలతో ముంచెత్తెవాడు.దాంతో జీవితాంతం ఇలాగే తన జీవితం ఉంటుందని భావించింది.అతడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లికి సిద్దం అయ్యింది.తల్లిదండ్రులకు చెప్పింది.కాని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.అతడికి అప్పటికే పెళ్లి అయ్యింది, అతడి చెడు అలవాట్ల కారణంగా అతడి భార్య విడిపోయిందని చెప్పే ప్రయత్నం చేశారు.