రాజమౌళి బాహుబలి సినిమాలో హాలీవుడ్ స్థాయి విజువల్స్ను చూపించి అద్బుతమైన ఫీల్ను కలిగించిన విషయం తెల్సిందే.అత్యాధునిక టెక్నాలజీని ఓన్ చేసుకుని తన సినిమాలకు వినియోగించడంలో రాజమౌళి ఎప్పుడు కూడా ముందు ఉంటాడు అనే విషయం తెల్సిందే.
బాహుబలి చిత్రం కోసం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వాడని టెక్నిక్స్ను కూడా వాడి కను విందు చేశాడు.ఎంతో కష్టపడి బాహుబలిని ఇండియాస్ నెం.1 చిత్రంగా మార్చిన రాజమౌళి ప్రస్తుతం రామ్చరణ్, ఎన్టీఆర్లతో మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.
ఇద్దరు టాప్ స్టార్స్ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.ఇలాంటి సినిమాలో ఎలాంటి టెక్నాలజీ వాడారు, గ్రాఫిక్స్ వాడారు అనే విషయాన్ని ఎవరు పట్టించుకోరు.ఎన్టీఆర్, చరణ్లు కనిపించడమే పెద్ద విజువల్ వండర్.
అయినా కూడా రాజమౌళి ఏమాత్రం తగ్గకుండా దేశంలోనే మొదటి సారి 120 కెమెరా రిగ్ను తెప్పించాడు.ఈ కెమెరా అత్యంత ఆధునాతన టెక్నాలజీతో రెడీ అయ్యింది.
ఈ కెమెరాతో చిత్రీకరణ చాలా విభిన్నంగా ఉంటుంది.యాక్షన్ సీన్స్ను ఈ కెమెరాతో చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది.360 డిగ్రీల కోణంలో యాక్షన్ సీన్స్ను చిత్రీకరించనున్నారట.
గతంలో బాహుబలి సమయంలో 360 డిగ్రీలు తిరిగి చూసే కెమెరాను తీసుకు వచ్చిన జక్కన్న ఈసారి సరికొత్త టెక్నాలజీతో ప్రత్యేక కళ్లద్దాలు పెట్టుకోకుండానే 3డిలో మూవీ కనిపించేలా ప్లాన్ చేస్తున్నాడు.సాదారణ థియేటర్ లో కూడా ఈ విజువల్ వండర్ ఆవిష్కారం అవుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరు అనే విషయమై స్పష్టత ఇవ్వని దర్శకుడు అతి త్వరలోనే మొదటి షెడ్యూల్ను పూర్తి చేయబోతున్నాడు.
అద్బుతమైన సెట్టింగ్స్ను నిర్మిస్తున్న జక్కన్న ఎక్కువగా అందులోనే చిత్రీకరణ చేయబోతున్నారు.