పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ త్వరలో రెండవ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెల్సిందే.తాజాగా రేణుదేశాయ్ నిశ్చితార్థం కూడా చేసుకుంది.
పెళ్లి నిశ్చితార్థ సమయంలో నానా హంగామా జరిగింది.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ని రెండవ పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించడం, రిక్వెస్ట్ చేయడం చేశారు.
అందుకే తనకు కాబోయే భర్త విషయాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచింది.తాజాగా మరోసారి రేణుదేశాయ్ తన విషయాల పట్ల చాలా గోప్యత ఉంచుతుందని వెళ్లడయ్యింది.
రేణుదేశాయ్లో ఒక మంచి కవి ఉన్న సంగతి తెల్సిందే.ఆమె ఇప్పటికే ఎన్నో కవితలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.తాజాగా వాటిని బుక్ రూపంలో తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.మరాఠిలో ఆమె రాసిన కవితలను అనంత శ్రీరామ్ చేత తెలుగులో తర్జమా చేయించింది.
త్వరలోనే తెలుగులో బుక్ను రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో రేణుదేశాయ్ సోషల్ మీడియా ముందుకు వచ్చింది.ఈ సందర్బంగా ఆమె లైవ్ లో మాట్లాడుతూ తన బుక్ను ఆధరించాని కోరింది.ఇదే సమయంలో ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
రేణుదేశాయ్ లైవ్లోకి రాగానే ఎక్కువ శాతం మంది పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించారు.ఇక అఖీరా గురించి కూడా ఎక్కువ శాతం మంది తెలుసుకునేందుకు ప్రశ్నించారు.అంతా కూడా పెళ్లి గురించి, పిల్లల గురించి అడుగుతున్న నేపథ్యంలో రేణుదేశాయ్కి కోపం వచ్చింది.
ప్రస్తుతం ఆ విషయం మాట్లాడను, ఆ ప్రశ్నలు కాకుండా మరే ప్రశ్నలైనా వేయండి అంటూ సమాధానాలు దాటవేసింది.పిల్లల గురించి ప్రశ్నిస్తే రేణుకు ఎందుకు ఇంత కోపం వస్తుందంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.