హిందువులని మరిచావా ట్రంప్..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సారి తన ప్రతిభని ట్విట్టర్ సాక్షిగా బయట పెట్టారు.దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్వేతసౌధంలోని చారిత్రక రూజ్‌వెల్ట్ గదిలో బుధవారం దీపావళి సంబరాలు నిర్వహించారు.

 Trump In Celebrate Deepavali But Forgets Hindu Peoples-TeluguStop.com

ఈ వేడుకలకు అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు భారతీయ- అమెరికన్లు.ఎంతో మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకకి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ట్రంప్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది.

దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ మేము అందరం ఒక్క చోటుకి చేరుకున్నాము.అమెరికాతో పాటు ప్రపచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది బౌద్ధులు, సిక్కులు, జైనులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.ఇందులో హిందువులను ట్రంప్ ప్రస్తావించలేదు.

దీంతో నెటిజన్లు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.

దీపావళిని హిందువులు కూడా చేసుకుంటారు అంటూ ట్విట్టర్ లో ట్రంప్ కి దిమ్మతిరిగిపోయెలా షాక్ ఇచ్చారు.దాంతో ఆ ధాటికి తట్టుకోలేక మరో సార ట్రంప్ ట్వీట్ చేశాడు మళ్ళీ హిందువులని మరిచి ట్వీట్ చేయడంతో ఈ సారి హిందువులు మరింత తీవ్రంగా కామెంట్స్ చేశారు దాంతో మూడోసారి.

నేను దీపావళి ఉత్సవాలకు అతిథిగా రావడం నేను గర్వకారణంగా భావిస్తున్నాను.దీపావళి వేడుకను నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నాను.

వీరంతా ప్రత్యేకమైన వ్యక్తులు అని ట్వీట్ చేశారు.

తాను అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత 24 మంది భారతీయ-అమెరికన్లను కీలక పదవుల్లో నియమించానని, వారు ఎంతో అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారని ట్రంప్ తెలిపారు.ఈ వేడుకల్లో అమెరికాలో భారత రాయబారి నవజ్యోత్‌సింగ్ సర్నా, ఆయన భార్య డాక్టర్ అవినా సర్నా పలువురు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube