ఏడుగురు సభ్యుల ముఠా ఒక లూటీ చేసి భారీగా సొమ్ము అపహరించారు.అయితే… అనుకోకుండా ప్రభుత్వం అప్పుడే ఓ కొత్త రూల్ పెట్టడంతో ఏం చేయాలో తెలియక అందులో కొంత సొమ్మును కాల్చేశారు.అందరిన ఆశ్చర్యానికి గురిచేసిన ఈ విషయం గురించి వివ్లరాలు చూస్తే… సేలం-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ లో లూటీ అయిన కేసును పోలీసులు చేధించారు.
2016లో సుమారు రూ.5.78కోట్లు రూపాయలు ఏడుగురు వ్యక్తులు గ్యాంగ్ లూటీ చేశారు.ఆ డబ్బును అందరూ సమానంగా పంచుకున్నారు.ఈ లోగా కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించింది.దీంతో దోచుకున్న డబ్బును ఆ దొంగలకు ఎలా మార్చుకోవాలో అర్థం కాలేదు.అటు ఇటూ పడి ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ తోపాటు పలు బ్యాంకుల్లో సుమారు రూ.3 కోట్లు మార్చేసుకున్నారు.మిగిలిన దాదాపు రూ.2 కోట్లు కాల్చివేశారు.ఈ కేసుకు సంబంధించి సీబీ-సీఐడీ రెండేళ్ల పాటు శ్రమించి ఏడుగురు గ్యాంగ్ ను మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో అరెస్ట్ చేశారు.