తెలుగు బిగ్బాస్ రెండవ సీజన్లో గత వారం ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు.దానికి తోడు ఇద్దరు గతంలో ఎలిమినేట్ అయిన వారు లోనికి వచ్చిన విషయం తెల్సిందే.
నూతన్ నాయుడు మరియు శ్యామలలు ఇంట్లోకి వచ్చిన నేపథ్యంలో ఈవారం ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం అని అంతా భావించారు.కాని కేవలం నందిని మాత్రమే ఎలిమినేట్ అయ్యింది.
హీరోయిన్ అయిన నందినిని ప్రేక్షకులు తిరష్కరించారు.ఆమెకు మద్దతుగా నిలిచేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు.
దాంతో నందిని ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
ఎలిమినేట్కు నామినేట్ అయిన వారిలో కౌశల్ మరియు బాబు గోగినేని శనివారం సేఫ్ జోన్లోకి వెళ్లగా, ఆదివారం టీవీ9 దీప్తి మరియు గణేష్లు సేఫ్ అయ్యారు.గణేష్ కంటే నందినికి తక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశం అయ్యింది.ఈ సమయంలోనే నందిని ఎలిమినేషన్కు కారణంగా కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
సీజన్ ఆరంభం నుండి కూడా కౌశల్కు వ్యతిరేకంగా మాట్లాడిన వారు లేదా కౌశల్తో గొడవ పడ్డవారు మాత్రమే ఎలిమినేట్ అవుతూ వచ్చారు.గత వారంలో పలు సార్లు, అంతకు ముందు వారాల్లో కూడా కౌశల్తో నందిని పదే పదే గొడవ పడటం జరిగింది.
దాంతో నందిని ఎలిమినేట్ అయ్యిందని కౌశల్ అభిమానులు అంటున్నారు.
కౌశల్ ఆర్మీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభావం చూపుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కౌశల్ భారీ ఫ్యాన్స్ను సొంతం చేసుకున్నాడు.అందుకే ఆయన ఎలిమినేషన్స్లో ఉంటే ఈజీగా సేఫ్ జోన్లోకి వెళ్లి పోతున్నాడు.
గత వారం కౌశల్కు భారీ ఎత్తున ఓట్లు పోల్ అయినట్లుగా మాటీవీ వర్గాల వారు చెబుతున్నారు.కౌశల్తో పెట్టుకున్న కారణంగానే నందిని ఔట్ అవ్వాల్సి వచ్చిందని కూడా కొందరు అంటున్నారు.
కౌశల్ ఆర్మీ ఒక వైపు కౌశల్ను సేవ్ చేస్తూనే నందినిని బయటకు పంపించేందుకు ఇతరులకు ఓట్లు వేశారని, అందుకే ఆమె ఇంటి నుండి బయట పడ్డదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కౌశల్కు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్కు కొందరు షాక్ అవుతున్నారు.నాని శనివారం నాటి ఎపిసోడ్లో కౌశల్ను టార్గెట్ చేయడంతో, నానిని కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం జరిగింది.మొత్తానికి కౌశల్ హీరో అయ్యాడు.