‘రేయ్’ చిత్రంతో నిర్మాతగా తీవ్రంగా నష్టపోయిన వైవీఎస్ చౌదరి ఇప్పట్లో కోలుకోవడం అంత సులభం కాదని అంతా భావించారు.కాని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం వైవీఎస్ చౌదరి త్వరలో అంతా కొత్త వారితో సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఒక యూత్ ఫుల్ ప్రేమ కథను ఇప్పటికే రెడీ చేశాడని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ కొత్త సినిమాను అతి త్వరలోనే ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా చౌదరి ఫిల్మ్ ఛాంబర్లో బొమ్మరిల్లు బ్యానర్లో ‘నేడే ఈనాడే కరునించె నన్ను చెలికాడే’ అనే టైటిల్ను రిజిస్ట్రర్ చేయించినట్లుగా తెలుస్తోంది.
అతి త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన చేయబోతున్నాడు.ఇక వైవీఎస్ చౌదరి ఈ సినిమాతో హీరో మరియు హీరోయిన్గా కొత్త వారినే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తక్కువ బడ్జెట్తో తెరకెక్కించాలని చౌదరి ప్లాన్గా తెలుస్తోంది.ఈ సినిమాతో అయినా చౌదరి తన మునుపటి క్రేజ్ను దక్కించుకుంటాడో చూడాలి.
గతంలో ఈయన కొత్త వారితో తెరకెక్కించిన ‘దేవదాసు’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.అదే తరహాలో ఈ చిత్రం కూడా చౌదరికి సక్సెస్ను తెచ్చి పెట్టనుందనే నమ్మకంతో ఆయన సన్నిహితులు ఉన్నారు.