ప్రముఖ దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి నిర్మాణ సంస్థ పేరు బొమ్మరిల్లు.ఇదే పేరుతో ఈయనకు థియేటర్స్ కూడా ఉన్నాయి.
గోదావరి జిల్లాలో బొమ్మరిల్లు థియేటర్స్ అంటే చాలా ఫేమస్.కాని ఆ థియేటర్లకు తాలం పడ్డట్లుగా సమాచారం అందుతోంది.
తమకు రావాల్సిన అప్పును వసూళ్లు చేసుకునేందుకు ఆంధ్రా బ్యాంక్ వారు ఆ థియేటర్లకు తాలం వేశారు.వైవిఎస్ చౌదరి ఆంధ్రా బ్యాంక్ నుండి 13 కోట్ల మేరకు అప్పు తీసుకు వచ్చాడు.
ఆ అప్పు వడ్డీతో కలిసి ఏకంగా 15 కోట్లకు చేరింది.దాంతో తనకా పెట్టిన థియేటర్లను వేలం వేయాలని ఆంధ్రా బ్యాంక్ నిర్ణయించుకుంది.
వైవిఎస్ చౌదరి నిర్మాణంలో తెరకెక్కిన ‘రేయ్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి.ఆయన ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగానే సినిమాను దాదాపు మూడు సంవత్సరాలు లేట్ చేశాడు.
ఎలాగోలా ఆ సినిమాను విడుదల చేసినా కూడా అది పెద్దగా ఆడక పోవడంతో భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.ఆ సినిమా వల్ల ఏకంగా 30 కోట్ల రూపాయలను చౌదరి నష్టపోయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అంతటి నష్టం వాటిల్లడం వల్లే ఇప్పుడు బొమ్మర్లిు థియేటర్స్ను వేలం వేయాల్సిన పరిస్థితి వచ్చింది.