ఏపీ విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవి.
సుబ్బారెడ్డి మంత్రి పదవిపై కన్నేశారా ? వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలిచి, జగన్ సీఎం అవుతారని భావిస్తోన్న ఆయన జగన్ కేబినెట్లో మంత్రి అవ్వాలని ప్లాన్ వేసి, అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే స్కెచ్ రెడీ చేసుకుంటున్నారా ? అంటే ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో అవుననే ఆన్సరే వస్తోంది.
ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా ఉన్న వైవి.
సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్లానింగ్లో ఉన్నట్టు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చలు వినపడుతున్నాయి.ప్రస్తుతం జిల్లా వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి వర్సెస్ ఎంపీ వైవి.
సుబ్బారెడ్డి మధ్య కోల్డ్వార్ ఓ రేంజ్లో జరుగుతోంది.ఎంపీగా ఉన్న జిల్లాలో పట్టు దొరక్కపోవడంతో వైవి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆయనలో మంత్రి అవ్వాలన్న కోరిక బలంగా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అద్దంకి నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిపోయారు.ఇక్కడ ప్రస్తుతం వైసీపీ బాధ్యతలు మాజీ మంత్రి బాచిన చెంచు గరటయ్య చూస్తున్నారు.
ఆయన కుమారుడు చైతన్యకు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టిక్కెట్టు వస్తుందన్న ఆశతో ఉన్నారు.
అయితే ఇప్పుడు సడెన్గా సీన్లోకి వైవీ ఎంటర్ అయ్యారు.
మరి వైవీ ఎంపీ సీటును వదిలి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జగన్ ఒప్పుకుంటారా ? మరి వైవీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తనకు ఎక్కడ పోటీ వస్తాడో ? అని భావిస్తోన్న బాలినేని ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు ఒప్పుకుంటాడా ? అన్నవి మాత్రం డౌటే.