వైసీపీ నేత జగన్ ప్రధానిని కలిసినంతనే టీడీపీ నేతలందరూ తీవ్రంగా స్పందించేస్తున్నారు .రాష్ట్రంలో ఉన్న మంత్రులు, సింగపూర్లో ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అంతగా ఎందుకు స్పందిన్చేస్తున్నారు, ఆపైన భయపడుతున్నారని వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.
పార్టీ కార్యాలయంలో ఆమె టిడిపి పై విరుచుకు పడ్డారు .జగన్ సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నది అందరికి తెలిసిందే .రాష్ట్ర సమస్యలకోసం ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను జగన్ కలిస్తే అందులో మంచి తీసుకోకుండా టీడీపీ యావత్తూవిమర్శలు చేస్తున్నారు.సిబి ఐ కేసుల భయంతోనే ప్రధానిని తరచూ జగన్ కలిశారంటూ టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలపై రోజా దుయ్యబట్టారు .ప్రధాని మోదీని జగన్ కలిసినంతనే.ప్రధాని చేస్తున్పపనులు ఆపేసి సీబీఐని నియంత్రిస్తారా? కోర్టుల్లో ఉన్న వ్యాజ్యాలను ఎత్తివేయిస్తారా అని ప్రశ్నించారు.ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి టీడీపీ సాహసానికి మెచ్చాలి .బహుశా వాళ్లకు ప్రధాని మోదీపై విశ్వాసం లేదేమోనని ఆమె వ్యాఖ్యానించారు.పట్టిసీమ వల్ల రాయలసీమ, కోస్తా, కృష్ణా డెల్టా రైతులకు ఎలాంటి ప్రయోజనమూ లేదని చె ప్పారు.కేవలం కాంట్రాక్టర్లకు సుష్టుగా మేపడానికి ఆపైన తాము మేసేందుకు తొందర పడిపోతున్నారు .వారికి పూర్తి స్థాయిలో ప్రయోజనం కలిగించేందుకే.అంచనాలను పెంచారని అన్నారు.
వారు చేస్తున్న కుప్పతెప్పలుగా అక్రమాలన్నీ ఢిల్లీలో బయటపడే రోజు దగ్గరలో ఉందని ఆమె తెలిపారు .