ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా కన్నీటి పర్యంతం అయ్యారు.తనను టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తిగతంగా విమర్శించారంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
రోజా సినిమాల్లో డైరెక్టర్ యాక్షన్, కట్ చెబితే ఎలా నటించేదో అసెంబ్లీలో కూడా జగన్ ఎలా చెబితే అలా మాట్లాడుతూ లేడీ విలన్ పాత్ర పోషిస్తోందని బుచ్చయ్య చౌదరి అన్నాడు.దాంతో రోజా ఆ మాటలకు సమాధానం చెప్పేందుకు స్పీకర్ను పదే పదే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరింది.
రోజా విన్నపాని పట్టించుకోలేదు.దాంతో తన ఆవేదనను పట్టించుకోలేదని ఎమ్మెల్యే రోజా సభలోనే విలపించింది.
తనను వ్యక్తిగతంగా విమర్శించిన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాల్సిందే అంటూ ఆమె డిమాండ్ చేస్తోంది.సభలోని వైకాపా ఎమ్మెల్యేలు రోజాకు మద్దతుగా నిలిచారు.
ఇక జగన్ ఈ సంఘటనపై మాట్లాడుతూ.నిండు సభలో ఒక మహిళ సభ్యురాలిని అవమానపర్చేలా మాట్లాడుతుంటే అంతా చూస్తూ ఊరుకుంటున్నారని తెదేపా సభ్యులను ఉద్దేశించి మాట్లాడాడు.
సభలో ఎవరేమన్నా తప్పుగా మాట్లాడినట్లు రుజువు అయితే వారితో స్పీకర్ క్షమాపణ చెప్పించాల్సిందే అంటూ సభా నిర్వహణ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చాడు.