వచ్చే ఎన్నికలు ఏపీలో వాతావరణాన్ని హీటెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.ఏపీలో వచ్చే ఎన్నికలకు మరో 20 నెలల టైం ఉండగానే రాజకీయం ఏ రోజు ? ఎలా మారుతుందో ఊహించడం కష్టంగా కనిపిస్తోంది.ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ+బీజేపీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా ? విడివిడిగా పోటీ చేస్తాయా ? అన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్.బీజేపీకి, టీడీపీకి మధ్య గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ, వైసీపీతో కలుస్తుందన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.
వైసీపీ, బీజేపీ కలిస్తే ఇటు చంద్రబాబు పవన్కళ్యాణ్తో కలిసి వెళతాడని టాక్.ఈ క్రమంలోనే చంద్రబాబు పవన్ను లైన్లో పెట్టుకునే ప్రక్రియ కూడా స్టార్ట్ చేసేశాడు.ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా పల్లెత్తు విమర్శ కూడా చేయడం లేదు.ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి ప్రయోజనాల విషయంలో పవన్ బీజేపీని మాత్రం బాగా టార్గెట్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే బుధవారం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్తో తనకు విబేధాల్లేవని స్పష్టం చేశారు.పార్టీ కోసం పనిచేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా తాము ఆహ్వానిస్తామని లోకేశ్ తెలిపారు.
వాస్తవంగా పరిస్థితి చూస్తే టీడీపీ ఫ్యూచర్ వారసుడు ఎవరు ? అన్న అంశంపై ఈ ఇద్దరి మధ్య కోల్డ్వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఇక చంద్రబాబు పవన్ను లైన్లో పెడుతుండడం, ఇటు లోకేశ్ కూడా ఎన్టీఆర్తో కలిసి వెళ్లేందుకు అభ్యంతరాలు లేవని చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్, పవన్ ఇద్దరూ సపోర్ట్ చేయడం కన్ఫార్మ్ అన్న చర్చలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇక వైసీపీ గెలుపు కోసం వన్ మ్యాన్ షో చేస్తోన్న వైసీపీ అధినేత జగన్కు పవన్, ఎన్టీఆర్ నుంచి గట్టి సవాల్ ఉంటుంది.టీడీపీకి వీరంతా కలిసినా బీజేపీ జగన్ కలిస్తే పోరు రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
బీజేపీ కూడా టీడీపీతోనే ఉంటే జగన్కు 2019లోను అధికారం డౌటే.!
.