ఏపీలో విపక్ష వైసీపీ రోజు రోజుకు వీక్ అవుతోంది.ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసపెట్టి అధికార పార్టీలో చేరిపోతున్నారు.
ఈ టెన్షన్లతో ఉన్న జగన్కు ఇప్పుడు సొంత ఫ్యామిలీలోనే పెద్ద షాక్ తగిలే వార్త ఒకటి బయటకు వచ్చింది.జగన్ చిన్నాన్న వైఎస్.
మనోహర్రెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ వస్తోన్న వార్తలు వైసీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి.
ఏపీలో త్వరలోనే 22 స్థానాలకు శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి.
వీటిలో వీలున్నన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే జగన్ సొంత జిల్లా కడపలో జగన్ బాబాయ్ వైఎస్.
వివేకానందరెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు.ఓ బాబాయ్ ఎన్నికల బరిలోకి దిగుతోన్న క్రమంలో మరో బాబాయ్ మనోహర్రెడ్డి జగన్కు షాక్ ఇస్తారన్న వార్తలు జగన్ను టెన్షన్ పెడుతున్నాయట.
అసలు మ్యాటర్ ఏంటంటే జగన్ చిన్నాన్న వైఎస్ మనోహర్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.ఆయన భార్య ప్రమీళ పులివెందుల మునిసిపల్ చైర్పర్సన్గా ఉంటే, ఆయన కూడా కౌన్సెలర్గా ఉన్నారు.
మునిసిపాలిటీలో వైఎస్ ఫ్యామిలీ పెత్తనం ఎక్కువవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
ఇక ఇటీవల పులివెందుల కమిషనర్ ఇంటిపై ఏసీబీ దాడులు, మనోహర్రెడ్డి వైఎస్ కుటుంబంలోని కొందరి వ్యవహారశైలిపై అంసతృప్తితో ఉండడం, ఆర్థిక పరమైన కారణాలు కూడా ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
అయితే జగన్ ఇప్పటికే ఆయన్ను బుజ్జగించేందుకు వివేకను రంగంలోకి దించారని కూడా సమాచారం.