అవును! నిజమే! ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలను 225 కి పెంచాలన్న విభజన చట్టంలోని క్లాజులకు అనుగుణంగా ఏదో విధంగా సీట్లను పెంచాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తున్నాయి.అయితే, ఇదే సమయంలో ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ మాత్రం.
దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారట.ఎట్టి పరిస్థితిలోనూ నియోజకవర్గాల సంఖ్య పెరగదని ఆయన ప్రచారం చేస్తున్నారు.
తన సొంత మీడియా ద్వారా కూడా ప్రచారం చేయిస్తున్నారు.
దీనివెనుక పెద్దకారణమే ఉందనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం వైసీపీ పరిస్థితి బాగోలేదని, ఉన్న నేతలను కాపాడుకోవడంలోనే అధినేత తలమునకయ్యారని టాక్.కొందరు టీడీపీలోకి ఇప్పటికే జంప్ చేయడగా.
మరికొందరు మౌనంగా తటస్థంగా ఉన్నారని, ఇంకొందరు జనసేనాని పిలుపుకోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు.ఈ సమయంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకే అభ్యర్థుల కొరత ఉందని చెబుతున్నారు.
ముఖ్యంగా 2019లో టీడీపీ, బీజేపీ కూటమిని ఎదుర్కోవాలంటే బలమైన నేతలు ఉండాల్సిన అవసరం ఉందని జగన్ భావిస్తున్నారు.దీంతో ఆయన నియోజకవర్గాల పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.
విభజన చట్టం ప్రకారం మరో 50 సీట్లు పెరిగితే అభ్యర్థులను ఎవరిని ఎంపిక చేయాలో అధినేతకు కష్టంగా మారుతుందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
మరికొందరు.
ఓ అడుగు ముందుకేసి.నియోజకవర్గాల పెంపుపై జగన్ ఆందోళన చెందకుండా.
పెంపుపై పాజిటివ్ ప్రచారం చేసి.పార్టీని సమాయత్తం చేస్తే మంచిదని అంటున్నారు.
మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.మరోపక్క, నియోజకవర్గాల పెంపుపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది.