ఏపీలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ వచ్చే ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.2019 ఎన్నికల్లో విజయం సాధించకపోతే పొలిటికల్ ఫ్యూచర్ లేదని డిసైడ్ అయిన జగన్ ఈ సారి ప్రతి నియోజకవర్గం మీద ఎంతో శ్రద్ధ కనపరుస్తున్నారు.ఈ క్రమంలోనే జగన్ నార్త్కు చెందిన రాజకీయ వ్యూహకర్త, ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిశోర్ను నియమించుకున్నాడు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 21 మంది పార్టీ ఫిరాయించేశారు.ఇద్దరు ఎంపీలు కూడా పార్టీకి దూరమయ్యారు.ఈ క్రమంలోనే చాలా నియోజకవర్గాల్లో పార్టీకి సరైన నాయకత్వం లేదు.ఇక్కడ బలమైన, గెలుపు ఛాన్సులు ఉన్న అభ్యర్థుల ఎంపిక జగన్కు పెద్ద సవాల్గా మారింది.
ఇక ప్రశాంత్ కిశోర్ టీం ఇప్పటికే ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పనితీరు ఎలా ఉందన్న అంశంపై ఓ విడత సర్వే పూర్తి చేసినట్టు వైసీపీ ఇన్నర్ టాక్.
ఈ సర్వేలో ప్రశాంత్ ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వవద్దని తేల్చి చెప్పినట్టు సమాచారం.
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్లకు బదులుగా బదులుగా కొత్త వ్యక్తులకు ఇక్కడ టిక్కెట్లు ఇవ్వాలని జగన్కు కిషోర్ చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ ఇద్దరు ఎంపీలపై ప్రశాంత్ కిశోర్ చేయించిన సర్వేలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందట.
వీరికి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తక్కువే అని కిశోర్ నివేదికలో పొందుపరచి జగన్కు ఇచ్చారట.వాస్తవానికి గత ఎన్నికల్లో కూడా వీరిద్దరు చావుతప్పి కన్నులొట్టబోయినట్టు స్వల్ప మెజార్టీలతోనే గెలిచారు.
ఇక ఇప్పుడు వీరికి టిక్కెట్లు ఇవ్వవద్దని ప్రశాంత్ చెప్పిన సలహాను జగన్ ఎంతవరకు పాటిస్తాడో చూడాలి.