ఖైదీ నెంబరు 150తో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే రేంజ్లో రీ ఎంట్రీ ఇచ్చాడు.బాక్సాఫీస్ కలెక్షన్స్ను ఖైదీ కొల్లగొడుతున్నాడు.
పదేళ్ల తర్వాత తెరపై కనిపించినా మునుపటి జోష్తోనే అలరించాడు.మెగాస్టార్ను అభినందిస్తూ కాంగ్రెస్ నేత టి.సుబ్బిరామిరెడ్డి ఇటీవలే ఒక కార్యక్రమం నిర్వహించి ఘనంగా సన్మానించారు.అయితే ఇప్పుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు కూడా చిరూని సన్మానించేందుకు సిద్ధమవుతున్నారట.
ఇంతవరకూ బాగానే ఉన్నా.దీని వెనుక పొలిటికల్ కలర్ కూడా ఉందని సమాచారం.
ముఖ్యంగా చిరూని లైన్లో పెట్టడానికి ప్రతిపక్ష నేత జగన్.దాసరిని రంగంలోకి దింపారని తెలుస్తోంది.
ఖైదీ నెంబర్ 150.చిరు 150 వ మూవీ సూపర్ హిట్! అయితే, ఇప్పుడు ఈ హిట్ మజాలోనే ఓ పొలిటికల్ సీన్ కూడా తెరమీదకి వస్తోందని టాక్! దర్శకరత్న దాసరి నారాయణరావు చిరును సన్మానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.దాని వెనుక పెద్ద తతంగమే ఉందట.అదేంటంటే.తనకు అధికారం దూరం కావడానికి కాపు సామాజిక వర్గం ఓట్లు రాకపోవడమే అని ప్రతిపక్ష నేత జగన్ విశ్వసిస్తున్నారు.2014లో పవర్ స్టార్ పవన్.టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ ఓట్లు టీడీపీకి పడిన విషయం తెలిసిందే! ఆ లోటును భర్తీ చేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
2019లో బాబుకు చెక్ పెట్టాలంటే.కాపు సామాజిక వర్గాన్ని చేరదీయాలని జగన్ భావిస్తున్నారు.అయితే, దీనికి సరైన నేత ఆయనకు కనిపించలేదు.ఇదే సమయంలో దాసరితోనూ సన్నిహితంగా ఉంటున్నారు.ఇప్పుడు అదే దాసరితో చిరుకు గేలం వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే చిరుకు భారీ ఎత్తున సన్మానాలు, సత్కారాలు జరుగుతు న్నాయని అంటున్నారు.దాసరి కూడా ఓ ప్రోగ్రాం పెట్టారంటే దాని వెనక జగన్ ఉన్నారని అంటున్నారు.
ఇదే నిజమైతే.పవన్కి పోటీగా అన్నయ్య మారడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.