ఏపీ సీఎం చంద్రబాబును ఇరుకున పెట్టబోయి.తానే ఇబ్బందుల్లో పడిపోతున్నారు ప్రతిపక్ష నేత జగన్! ఇప్పటికి ఇది పలుమార్లు రుజువైంది.
అయితే ఇప్పుడు మళ్లీ ఇలాంటి ప్రయత్నమే చేసి జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి తరలించడంపై చంద్రబాబును విమర్శించబోయి ప్రతిపక్ష నేత పప్పులో కాలేశారు! లాజిక్లు వదిలేసి.
ఆయన మాట్లాడటం.చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లి ఆంధ్రులపై తనకున్న అభిమానాన్నిబాబు చాటుకున్నారని జగన్ నిరూపిస్తున్నట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అన్ని పార్టీలు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే పార్టీ కార్యాలయాలను ఏర్పాటుచేసుకున్నాయి.
కానీ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే కార్యకాలాపాలు కొనసాగిస్తుండటంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే! అయితే దీనిపై జగన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.అయితే ఈ ప్రయత్నంలోనే తాను సొంత ఇంటిని నిర్మించుకోవడం వల్ల కాస్త ఆలస్యమౌతోందనీ, చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్నారని జగన్ తాజాగా విమర్శించారు.
అయితే ఇక్కడే కొన్ని లాజిక్లు మిస్ అయ్యారు.
ఓటుకు నోటు కేసు వెలుగులోకి రావడం… అందులో చంద్రబాబు మాటలు వినిపించడం.
ఇక రేవంత్ రెడ్డి జైలు.ఈ కారణాల వల్లే ఇక చంద్రబాబు విజయవాడకు మకాం మార్చారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
జగన్ వీటిని కనీసం ప్రస్తావించలేదు, ఉమ్మడి రాజధాని నుంచి అధికార పార్టీ పారిపోయినా సరే… ప్రధాన ప్రతిపక్ష నేతగా తాను హైదరాబాద్లో ఉంటున్నాననీ, ఇక్కడి సెటిలర్స్కు కాస్తోకూస్తో భరోసాగా నిలుస్తూ పదేళ్లపాటు మనకున్న హక్కుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నానని జగన్ చెప్పి ఉంటే మరోలా ఉండేదని పలువురి అభిప్రాయం.
ఈ లాజిక్స్ వదిలేసి మకాం మార్పు విషయంలో సెల్ఫ్గోల్ చేసుకునేలా జగన్ మాట్లాడుతున్నారు.
చంద్రబాబు ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా, అది ముఖ్యమంత్రి అధికార నివాసమే అవుతుంది కానీ చంద్రబాబు సొంత ఇల్లు కాదు కదా! సొంత ఇల్లు కట్టుకుంటున్నానని అందుకే ఆలస్యమవుతోందని జగన్ చెబుతున్నా.మరి మూడేళ్లయినా ఎందుకు నిర్మించలేదో అనే పాయింట్ జగన్ మిస్ అయినట్టే!!
.