వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం తన పార్టీనుంచి అధికార పార్టీలోకి జరుగుతున్న ఫిరాయింపుల మీద చాలా అసహనంతో ఊగిపోతున్నారు.ఇలాంటి నేపథ్యంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలందరితో లోటస్పాండ్లో సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి ఏకంగా 13 మంది గైర్హాజరు కావడం ఆయనను మరింతగా కోపానికి గురిచేసి ఉండవచ్చు.
ఆ కోపాన్ని వచ్చిన వారి మీద ప్రదర్శించడం, పార్టీని బాగు చేసుకోవడానికి తమకు తోచిన సలహాలు ఇచ్చిన వారి మీద కత్తులు దూయడం గా మారితే ఎవరు మాత్రం హర్షిస్తారు? అందుకే జగన్లోని అహంకారమే పార్టీకి ప్రమాదకరంగా మారుతోందని ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎమ్మెల్యేలతో భేటీకి 47 మంది హాజరు కాగా, తన ప్రసంగం పూర్తయిన తర్వాత జగన్ ఎమ్మెల్యేల అభిప్రాయాలు కోరినట్లుగా తెలుస్తున్నది.
మీరు ఎమ్మెల్యేలతో తరచూ కలుస్తూ ఉండాలి అని ఒకరు సలహా చెప్పగానే.జగన్ అసహనం హద్దు దాటిపోయిందిట.మరో ఎమ్మెల్యే కూడా అదే మాట అనడంతో.‘టైం వచ్చింది కదాని.
నాకే సలహాలు ఇస్తారా’ అంటూ కస్సుమన్న జగన్ అర్థంతరంగా లేచి.సమావేశంలోంచి వెళ్లిపోయారుట.
ఆయన తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపట్ల ఇంత అమర్యాదకరంగా ప్రవర్తిస్తే ఎలా అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.జగన్ ఇదివరకటిలాగే ఇంకా అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటే పార్టీ మరింతగా పతనం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు
.