వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయనకు అత్యంత ఆప్తుడైన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిపై ఫైర్ అయ్యారు! తనకు ఇష్టంలేని పని చేయడంపై ఆయన కొంత అసహనానికి గురయ్యారట.మరి వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం.
సీనీ నటుడు మోహన్బాబేనట!! అసలు జగన్, పెద్దిరెడ్డి మధ్య మోహన్బాబు ఎందుకు ప్రవేశించాడనేగా మీ సందేహం!! అదేంటంటే.మోహన్బాబుకు వైఎస్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే మోహన్బాబు.వైసీపీలోకి మారిపోతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.
అయితే ఇదే విషయాన్ని మరో సారి మోహన్బాబును అడిగి.జగన్తో పెద్దిరెడ్డి మాటలు పడాల్సి వచ్చిందట.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి.మోహన్ బాబుకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది.
ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి.ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో ఇద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు.
హైదరాబాద్ నుంచి తిరుపతికి ఒకే ఫ్లైట్ లో బయలుదేరారు.గమ్యస్థానాన్ని చేరుకునే క్రమంలో ముచ్చట్లలో మునిగిపోయారు.
అందులో భాగంగానే మోహన్ బాబును వైసీపీలోకి ఆహ్వానించారట పెద్దిరెడ్డి.అయితే ఆయన మాత్రం ఏదీ చెప్పకుండానే దాటవేశారట.
అంతేకాదు వైసీపీ టాపిక్ వచ్చినప్పుడు ఆయన ముఖంలోనూ ఎలాంటి రియాక్షన్ రాలేదని సమాచారం.
ఈలోగా తిరుపతి రానే వచ్చింది.
ఇద్దరూ కలిసి తిరుపతి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి… ఎవరి పని మీద వారు వెళ్లిపోయారు.అయితే ఈ విషయం మాత్రం బయటి వ్యక్తుల ద్వారా ఈ విషయం బయటకు పొక్కింది.
చివరకు జగన్ వరకూ వెళ్లిందట.దీంతో ఆయన పెద్దిరెడ్డిపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఎన్ని చెప్పినా మోహన్ బాబు టీడీపీ మనిషేనని… అలాంటి వ్యక్తిని వైసీపీలోకి ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారట.మోహన్ బాబును తాను ఎప్పుడో ఆహ్వానించానని… అప్పుడే స్పందించని ఆయన… ఇప్పుడు వైసీపీలోకి వస్తారని ఆశించడం అవివేకమని పెద్దిరెడ్డితో చెప్పారట.
జగన్ రియాక్షన్ చూసి పెద్దిరెడ్డి నొచ్చుకున్నట్టు సమాచారం.ఏదో మాటల సందర్భంలో మోహన్ బాబును వైసీపీలోకి ఆహ్వానిస్తే… ఇంత రాద్ధాంతం అవసరమా అని పెద్దిరెడ్డి తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.
అయితే వైసీపీ క్యాడర్ మాత్రం ఇదంతా మోహన్ బాబు వల్లేనని గుసగుసలాడుకుంటున్నారు.తన ప్రమేయం లేకుండానే జగన్ పార్టీలో పెద్ద రచ్చకు కారణమయ్యారు మోహన్బాబు!!
.