నాపై బాంబు దాడి వెనక ఉన్నది వైఎస్సే

తనపై జరిగిన సూట్ కేస్ బాంబు దాడికి, పరిటాల రవి హత్యకు వెనుక వైఎస్ హస్తముందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మ‌రోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్ర‌వారం మహానాడు వేదిక‌పై ఆయ‌న మాట్లా డుతూ వైఎస్ కుటుంబం తొలి నుంచీ నేర చరిత్ర ఉన్న‌దేన‌ని హ‌త్య‌ల‌ సంస్కృతి వారి సొంత‌మ‌ని ఆరోపించారు.

 Ys Family Totally In Vailence History-TeluguStop.com

గోదావరి జిల్లాలలో జరిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల వెనుక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉందని తాము ముందు నుంచి చెపుతున్నామన్నారు.ప్ర‌సాంత‌త‌కు మారు పేరుగా ఉండే ఉభయగోదావరి జిల్లాల్లో దుర్మార్గమైన కార్యక్రమాలు, హింస క‌నీ వినీ ఎర‌గం.

కానీ ‘కాపుల ఉద్యమం స‌మ‌యంలో ఆ జిల్లాల‌లోని ప్రజలను జ‌గ‌న్ త‌న మ‌నుషుల‌తో అరాచకాలకు ఒడిగ‌టి్ట భయబ్రాంతులకు గురి చేసేలా , ఏకంగా ఓ రైలునే తగులపెట్టిన ఘ‌న‌త వారిదేన‌ని ఆరోపించారు .రాష్ట్ర ప్ర‌జ‌లంతా భయపడేలా చేసారంటే ఎంత దుర్మార్గ చ‌ర్య‌ల‌కు విప‌క్షం పాల్ప‌డుతోందో ఆలోచించుకోవాలి.ఆ హింసకు పాల్పడే ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని తీవ్ర స్తాయిలో విరుచుకు పడ్డారు .

రాజ‌కీయాలలో జ‌గ‌న్ లాంటి వారిని చాలా మందిని చూశా.ఎవరికీ భయపడే త‌త్వం నాది కాద‌ని.ప్రజల కోసం ప్రాణాలు ప‌ణంగా పెడతా’ అంటూ మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు స‌త్వ‌త్రా చర్చనీయాంశమ‌వుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube