మాజీ సినీనటి, చిత్తూరు జిల్లా నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా నోరు తెరిస్తే చాలు బూతులే.ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది.
బయట సరే సరి…ఏకంగా అసెంబ్లీలోనే అన్ని పార్టీల ప్రజా ప్రతినిధుల సమక్షంలో, లైవ్ కెమేరాలు ఉండగానే రోజా సీఎం చంద్రబాబును కామ సీఎం చంద్రబాబు అనడం అసెంబ్లీని ఓ కుదుపు కుదిపేసింది.చివరకు ఈ వివాదంలో రోజా అసెంబ్లీ నుంచి సస్పెన్షన్కు గురి కావడం, సుప్రీంకోర్టు మెట్టెక్కడం కూడా జరిగాయి.
సుప్రీంకోర్టుకు వెళ్లినా, సస్పెన్షన్ ఎదుర్కొన్నా కూడా రోజు తీరులో అసలు ఏ మాత్రం మార్పు రాలేదు.తాజాగా ఆమె పవిత్రపుణ్యక్షేత్రమైన తిరుపతి వెంకన్న గుడిలో మరోసారి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఓ రేంజ్లో ఫైరైపోయారు.
సాధారణంగా తిరుమలకు వచ్చే రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా రాజకీయపరమైన విమర్శలు చేయరు.
దేవుడు గురించి నాలుగు మాటలు… స్వామివారి నామస్మరణ చేస్తారు.
కానీ రోజా మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించింది.తనకు అలవాటైన రీతిలోనే తిరుమల వెంకన్న సాక్షిగా రోజా రాజకీయ విమర్శలు చేసి మరోసారి తన నోటి దురుసును బయటపెట్టుకున్నట్లయ్యింది.
మీడియా మైకులు కనపడగానే….తాను తిరుమల కొండమీద ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయిన ఆమె నోట్ల రద్దు మీద మోడీని ఏకి పడేశారు.
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మోడీపై విమర్శలు చేసినా రోజా… తల్లిని సైతం క్యూలైన్లో నుంచో పెట్టిన మోడీ, ముఖేష్ అంబానీని మాత్రం ఎందుకు క్యూలో నిలుచోబెట్టలేదంటూ మోడీపై మండిపడ్డారు.ప్రజల కష్టాలను ఏకరువు పెట్టిన ఆమె మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మోడీపై విమర్శలతో తిరుమల పుణ్యక్షేత్రంలోనే రెచ్చిపోయి విమర్శలు చేసిన ఆమె తీరును పలువురు తప్పుబడుతున్నారు.సాధారణంగా రాజకీయ నాయకులు ఎవ్వరూ తిరుమలలో రాజకీయ విమర్శలు చేయరని…కానీ రోజా మాత్రం తనకు అలవాటైన రీతిలోనే విమర్శలు చేశారని పలువురు రోజాపై ఫైర్ అవుతున్నారు.