ఏపీలో వచ్చే ఎన్నికలకు మరో రెండేళ్ల టైం ఉన్నా అప్పుడే పొలిటికల్ హీట్ ఓ రేంజ్లో రాజుకుంది.అధికార టీడీపీకి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు, అన్ని నియోజకవర్గాల్లోను బలమైన అభ్యర్థుల కోసం ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది.
ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు సైకిలెక్కిన సంగతి తెలిసిందే.ఇక విపక్ష వైసీపీ బలంగా ఉన్న జగన్ సొంత జిల్లా కడపలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు ఆయనకు ఏకంగా మంత్రి పదవిని కూడా ఇచ్చారు.
ఆదినారాయణరెడ్డి లాంటి దూకుడు రాజకీయాలు చేసే వ్యక్తి టీడీపీలో ఉంటే జగన్ను ఢీ అంటే ఢీ అనే రీతిలో ఢీ కొట్టవచ్చన్నది చంద్రబాబు ప్లాన్.ఇదిలా ఉంటే అదే కడప జిల్లాలో మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా ఆకర్ష్ వలలో పడినట్టు జిల్లాలో వార్తలు జోరుగా ట్రెండ్ అవుతున్నాయి.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జగన్కు బైబై చెప్పి టీడీపీలో చేరుతున్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆయనకు టీడీపీ రెండు ఆఫర్లతో వల వేసినట్టు టాక్.
పార్టీ మారితే వచ్చే ఎన్నికల్లో సీటుతో పాటు కాస్త ఆర్థికసాయం కూడా చేస్తామని టీడీపీ అధిష్టానం నుంచి ఆదినారాయణరెడ్డి ద్వారా ఆఫర్ వచ్చిందట.దీంతో ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఈ వార్తలు జోరందుకోవడంతో శివప్రసాద్రెడ్డి స్పందించారు.
తనకు వైఎస్ అన్నా, జగన్ అన్నా ఎంతో కృతజ్ఞత ఉందని.
తాను పార్టీ మారే ఉద్దేశం లేదని, తనపై వస్తోన్న దుష్ప్రచారం మానుకోవాలన్నారు.అయితే గతంలో పార్టీ మారిన వారందరూ ఇలాంటి వ్యాఖ్యలు చేశాకే జంప్ చేసేశారు.
మరి శివప్రసాద్ రెడ్డి రూటు ఎలా ఉంటుందో చూడాలి.