ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ అమలుకాలేదంటూ, తెలుగుదేశం పార్టీని ఎండగడట్టేందుకు వైసీపి అధినేత జగన్ రెడ్డి ప్రారంభించిన “గడప గడపకు వైసీపీ” కార్యక్రమం ఫ్లాప్షోగా మారిందంటూ పార్టీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.
ఇడుపులపాయలో గడప గడపకు వైసీసీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాక, .
తొలి రోజున వైసీపీ ఎమ్మెల్యేలు , ఆ పార్టీ నేతలు పేపర్లలో కోసం ఫోటోలు తీసేంత వరకు నాలుగు గడపలు తిరిగి, కార్యక్రమం కాస్త కార్యకర్తలకు అప్పగించేసి కార్లు ఎక్కేసారు.చచ్చి చెడి వైఎస్ మీద అభిమానంతో గడప గడపకు వెళ్తున్న కార్యకర్తలకు మా ఎమె్మల్యే ఏడంటూ నిలదీస్తూ, కొన్ని గ్రామాలలో ప్రజలే కార్యక్రమానికి అడ్డుపడుతుండటంతో పెద్ద చిక్కేవచ్చిందని వినవస్తోంది.సీనియర్ నేతలు, కొంత కాలం క్రితం కాంగ్రస్ నుంచి చేసిన నేతలు సైతం చేతులు ఎత్తేయటంతో ఆర్బాటంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం కూడా తుస్సు అయిపోయిందన్నది కార్యకర్తల వేదన.
ఇక అధికాపక్షానికి వంద ప్రశ్నల కరపత్రాలను ఇంటింటికీ పంచడంతో పాటూ, గడప గడపకు వైసీపీలో పార్టీ బలోపేతానికీ దృష్టి సారించాలని, అసమ్మతి తెలుగుదేశం నేతల్ని పార్టీలోకి తీసుకురావాలని జగన్ ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా కనిపించడంలేదు.
పార్టీలోకి వస్తే, అంత చేస్తాం, ఇంత చేస్తామని నేతలు హామీలు గుప్పిస్తున్నా, బైటకొచ్చిన నేతల స్టేట్మెంట్లను వింటున్న వారు ససేమిరా అంటున్నారట.ఆర్ధిక ప్రయోజనాలు కల్పిస్తామని చెపితే ఇప్పుడే ఇచ్చేయాలని కోరుతుండటంతో, పెద్ద తలనొప్పిగా మారిందట.
గడప గడపకు వైసీపీ కి తొలి రోజు చేసిన హడావుడి చూస్తే ఇక రానున్న ఎన్నికలలో మనదే అధికారం అన్న రేంజ్లో సాగినా, ఇప్పుడు అని ప్లాప్షోను తలపిస్తుండటంతో ఇంకా ఆరు నెలలు ఈ కార్యక్రమం ఎలా సాగించాలా అన్నది పెద్ద ్రపశ్నగా కనిపిస్తోంది.పేలవంగా సాగులున్న ఈ కార్యక్రమం కు రాష్ట్ర పార్టీ పైసలు ఖర్చు చేసేందుకు నిరాకరించడంతో, మాకెందుకు.
అని అంతా పక్కకి తప్పు కుంటూ ఉండటంతో ముందుకు సాగేలా కనిపించడంలేదట.
అనేక విభజన సమస్యల నడుమ ఉన్న రాష్ట్రంలో విస్పస్ట మెజార్టీలో ఉన్న అధికారపార్టీ కూలిపోతోందని, రెండు నెలల్లో తనే ముఖ్యమంత్రిని అవుతారంటూ పదే పదే పార్టీ అధినేత జగన్కు చెప్పిన జ్యోతిష్యులే పార్టీ చేపట్టిన గడప గడపకూ విజయవంతం అవుతుందంటూ తేదీని ఖరారు చేసినట్టు వినవస్తోంది.
మధ్యలో ఈ గోలేంటో అర్ధంకాక, వైసీపీ నేతలు గడప దాటేందుకు కూడా ముందుకు రావటంలేదన్నది ఓ కథనం.మరి రేపేం జరగనుందో చూడాలి .