భయం కలిగించే విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కుష్టు వ్యాధి కేసుల్లో 58 శాతం భారతీయిలే ఉంటున్నారు.ఈ కేసుల్లో 10% మంది పిల్లలు ఉంటున్నారు.
ఇది నిజంగా ప్రమాదకరమైన సూచనే.ఇందువల్లనే దేశంలో మొట్టమొదటిసారిగా కుష్టు వ్యాధి కోసం టీకా రాబోతోంది.
దీన్ని ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు.
భారతదేశంలోనే తయారుచేసిన ఈ టీకాను మొదట పైలట్ ప్రాజెక్టు కింద బిహార్, గుజరాత్లోని ఐదు జిల్లాల్లో ఉపయోగించనున్నారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ డైరక్టర్ డాక్టర్ జేపి తల్వార్ ఈ వ్యాక్సిన్ ను ప్రజల కోసం అభివృద్ధి చేసారు.సెంట్రల్ లెదర్ రిసర్చ్, సాక్షం, రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో జరిగిన కుష్టు వ్యాధి అవగాహన సదస్సులో మంత్రి ఈ టీకాను ప్రకటించారు.
ఈ సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ కుష్టువ్యాధి కేసులను మూడేళ్ళలో 60% వరకు ఈ టీకా తగ్గిస్తుందని, అలాగే శరీర గాయాలని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని, కుష్టువ్యాధి బారిన పడినవారికే కాకుండా, వారితో గడుపుతున్న వారికి కూడా ఈ టీకా ఉపయోగపడుతుందని చెప్పారు.