ప్రపంచ బ్యాంకు ఏం చేస్తుందో తెలుసు కదా…! డబ్బు అవసరమైన దేశాలకు, రాష్ర్టాలకు అప్పులు ఇస్తుంది.అప్పు ఇవ్వగానే అనేక షరతులు పెడుతుంది.
ప్రభుత్వాలు ఏం చేయాలో, చేయకూడదో నిర్దేశిస్తుంది.తన మాటే వినాలని శాసిస్తుంది.
ప్రపంచ బ్యాంకుపైన ప్రపంచవ్యాప్తంగా విమర్శలున్నాయి.చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ‘ప్రపంచ బ్యాంకు జీతగాడు’ అని ప్రతిపక్షాలు, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు విరుచుకుపడ్డాయి.
మన్మోహన్ ప్రధానిగా ఉండగా కూడా ఇవే విమర్శలు వచ్చాయి.మన దేశానికి ఎవరు ప్రధానిగా ఉంటే వారిని ప్రపంచ బ్యాంకు ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది.
ప్రశంసల జల్లు కురిపిస్తుంది.ప్రస్తుతం నరేంద్ర మోదీని యమ పొగుడుతోంది ప్రపంచ బ్యాంకు.
ఆయన గొప్ప దూరదృష్టి ఉన్న నాయకుడు అని ప్రపంచ అధిపతి జిమ్ యోంగ్ కిమ్ ప్రశంసించారు.దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అసాధారణ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
మోదీ కొంత కాలం కిందట ప్రారంభించిన ‘జన్ ధన్ యోజన’ పథకాన్ని ప్రపంచ బ్యాంకు అధిపతి యమ పొగిడారు.జన్ ధన్ యోజనపై బ్యాంకు ఒక నిదేదిక తయారుచేసింది.
బ్యాంకు ఈ పథకం గురించి గొప్పగా చెప్పంది.ఇదంతా బ్యాంకు కాకాయిజంలో భాగమేనని విమర్శకులు అంటారు.
బ్యాంకు పని అప్పులు ఇవ్వడమే కాబట్టి నాయకులను పొగిడి తమ మార్గం సుగమం చేసుకుంటుంది.