బాలీవుడ్లో సల్మాన్ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన ‘దబాంగ్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఆ సినిమాను మొదట తమిళంలో ‘ఓస్తి’గా రీమేక్ చేశారు.
శింబు, రిచా గంగోపాధ్యాయ హీరో హీరోయిన్లుగా నటించిన ఆ రీమేక్ సూపర్ హిట్ అయ్యింది.అదే ‘దబాంగ్’ సినిమాను తెలుగులో హరీష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా ‘గబ్బర్సింగ్’ అంటూ తెరకెక్కించారు.
తెలుగులో ‘గబ్బర్సింగ్’ ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.హిందీ, తమిళం, తెలుగులో భారీ విజయం సాధించిన మరో సినిమాను తెలుగులో రాబోతుంది.
కోలీవుడ్లో రీమేక్ అయిన ‘ఓస్తి’ సినిమాను ‘తిమ్మిరి’ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.నిర్మాత తాండ్ర రమేష్ ఈ సినిమాను డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాడు.
ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి అయిన ఈ సినిమాను ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా నిర్మాత రమేష్ చెప్పుకొచ్చాడు.రెండు రాష్ట్రాల్లో కలిపి అయిదు వందల థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్మాత పేర్కొన్నాడు.
హాట్ సమ్మర్లో అంతా ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నాడు.అయితే ఇప్పటికే ‘దబాంగ్’, ‘గబ్బర్సింగ్’ను చూసిన తెలుగు ప్రేక్షకులు ఈ ‘తుంటరి’ని ఆధరిస్తారా అనేది అనుమానమే.!
.