తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ చిత్రం ‘రుద్రమదేవి’.ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది.
కాకతీయుల కళా వైభవాన్ని కన్నులకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించేందుకు దర్శకుడు గుణశేఖర్ ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాడు.తాజాగా ఈ సినిమా ఆడియో వేడుకను వైజాగ్ మరియు వరంగల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మరియు రానాలతో పాటు ఎంతో మంది మేటి నటీనటులు నటించారు.ఈ సినిమాను గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది.అప్పటికి ఈ సినిమా బడ్జెట్ను 50 కోట్లు అనుకున్నారు.
గుణశేఖర్ ఈ సినిమా 50 కోట్ల లోపు బడ్జెట్తో పూర్తి చేయాలని భావించాడు.కాని సినిమా పూర్తి అయ్యేసరికి ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 70 కోట్లను చేరిందట.
ఈ విషయాన్ని స్వయంగా గుణశేఖర్ ప్రకటించాడు.భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎక్కడ కూడా లోపం జరుగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఖర్చుకు వెనకాడకుండా ఇంత బడ్జెట్ను పెట్టడం జరిగింది.
మరి చేతులు దాటి పోయిన ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు నిర్మాతకు ముచ్చెమటలు పట్టిస్తోంది.ఇంత పెట్టుబడి వెనక్కు వస్తుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.
స్టార్ హీరోల సినిమాలే సూపర్ హిట్లు అయితే 50 కోట్లు రాబట్టుకోవడానికి కష్టపడుతున్నాయి.అటువంటిది ఈ సినిమా 70 కోట్లను వసూళ్లు చేస్తుందా చూడాలి.