దేవాలయాల్లో వేప చెట్టు,రావి చెట్టు కలిసి ఉండటాన్ని మనం చూస్తూనే ఉంటాం.రావి చెట్టు శ్రీ మహా విష్ణువు అని,వేప చెట్టు లక్ష్మి దేవి అని శాస్రాలు,వేదాలు చెపుతున్నాయి.
ఈ జంట వృక్షాల చుట్టూ ప్రదక్షణ చేస్తే అనేక దోషాలు తీరిపోతాయి.శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేసి కౌగలించుకొని నమస్కారం చేస్తే అనేక ఆ దోషానికి పరిహారం జరిగి దోషం తొలగిపోతుంది.
రావి చెట్టు కిందే బుద్దుడికి జ్ఞానోదయం అయింది.అంతేకాక శ్రీకృష్ణుడు చివరి దశలో రావి చెట్టు కింద విశ్రమించి వైకుంఠానికి చేరాడు.
అలాగే వేప చెట్టు గాలితో అనేక రకాల రోగాలు నయం అవుతాయి.అందువల్ల పవిత్రమైన వృక్షాలను పవిత్రమైన ప్రదేశంలో పెంచుతారు.
వేప చెట్టును ఇంటిలో వేసుకోవచ్చు.కానీ రావి చెట్టు మాత్రం ఇంటిలో ఉండకూడదు.
.