నందమూరి తాఅరక రామారావు…ఈ పేరు వింటేనే తెలుగు వారి గుండె పులకరించిపోతుంది.ఆడపడుచులైతే అన్నా అంటూ ఆత్మీయతతో తల్లడిలిపోతారు.
అలాంటి అన్నగారిపై అభిమానంతో ఆయనకు భారత రత్న రావాలనే ఆశ ప్రతీ తెలుగువాడిలోనూ ఉంది.ఇక అదలా ఉంటే.
తాజాగా మరోసారి ఎన్టీఆర్.భారత రత్న విషయం తెరపైకి వచ్చింది.
సినీ నటుడు…ఆర్.నారాయణ మూర్తి.
నిన్న జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ….ఎన్టీఆర్ ఎందులో తక్కువ…ఎం.
జీ.ఆర్ కన్నా…ఎన్టీఆర్ ఎందుకు తక్కువ.ఎం.జీ.ఆర్ కేవలం తమిళ నాడుకే పరిమితం.కానీ ఎన్టీఆర్ బ్రతికి ఉంటే ఈ దేశానికే ప్రధాని అయ్యేవారు.
అంతేకాకుండా లతా మంగేష్కర్ కు వచ్చిన భారత రత్న.మన సుశీలమ్మకు ఎందుకు రాదు.
తెలుగు వారిపై ఎందుకింత వివక్ష.ఇలాంటి ఉన్నత పురస్కారాల్లో కూడా లాబీయింగ్ జరగడం నిజంగా సిగ్గు పడుతూ.
బాధపడాల్సిన విషయం అంటూ నారాయణ్ మూర్తి తెలుగు వారిపై మరోసారి తన అభిమానాన్ని.తెలియ జెప్పారు.
నిజమే నారాయణ్ మూర్తి చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు.ఈ సారైన ఎన్టీఆర్ కు భారత రత్న ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూశారు తెలుగు తమ్ముల్ళు.
కానీ మోడి సాబ్ ఆ విషయంలోనూ తెలుగు వారికి హ్యాండ్ ఇచ్చారు.