మన దేశంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని మతానికి అనుగుణంగా అతని బంధువులు మృతదేహాన్ని కాల్చడమో లేదా పూడ్చడమో చేస్తారు.ఈ విధంగా చేసే దహన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు స్నేహితులు, తెలిసిన వారు అనేక మంది హాజరవుతుంటారు.
కానీ హిందూ సాంప్రదాయంలో మాత్రం ఈ కార్యక్రమానికి కేవలం పురుషులు మాత్రమే హాజరు అవుతూ ఉంటారు.స్త్రీలు హాజరు కారు.
ఈ విధంగా స్త్రీలు ఎందుకు స్మశానంలోకి రారు …? దానికి గల కారణాన్ని తెలుసుకుందాం.
పురుషులు అందరూ దహన కార్యక్రమానికి వెళితే స్త్రీలు ఇంటి వద్దే ఉండి ఇంటి సంరక్షణ, పిల్లల బాధ్యతలను చూసుకునేవారు.
దీంతోపాటు వచ్చిన వారికి ఆహార సదుపాయాన్ని కల్పించడం కోసం స్త్రీలు ఇంటి దగ్గరే ఉండి భోజనం సంగతి చూసుకునే వారు.అందుకే దహన కార్యక్రమానికి స్త్రీలు వెళ్లేవారు కాదు.