‘దీపం పరం జ్యోతి’ అని మన పెద్దలు అన్నారు.దీపాన్ని జ్ఞానానికి ప్రతీకగా చెప్పుతారు.
వెలుగును నింపే దీపం మన హృదయంలో అజ్ఞానాన్ని ప్రాలద్రోలాలని అనే కోరికతో మనం దీపారాధన చేస్తాం.దీపం వెలిగిన ఇంటిలో లక్ష్మి దేవి తాండవం ఆడుతుంది.
దేవుడికి ఎన్ని రకాల ఉపచారాలు చేసినా దీపారాధన చేస్తే కానీ పూర్తి పూజ కాదు.దేవునికి దీపం వెలిగించటానికి ఆవునెయ్యి,నువ్వుల నూనె రెండు శ్రేష్టమైనవి.
వీటితో దీపారాధన చేయటం వలన ఇంటిలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.అయితే కొంత మంది దీపం వెలిగించకుండా ఆగి వెలిగే విద్యుత్ దీపాలను పెడుతూ ఉంటారు.
ఆ విధంగా చేయటం చాలా తప్పు.