శ్రీమంతుడు రికార్డులని తిరగారాయడానికి అందరు హీరోలు ప్రయత్నించారు.కాని అందరు ఫెయిల్ అయ్యారు.
అంతమాత్రాన మహేష్ ని మోసేది లేదు .ఎందుకంటే మహేష్ కూడా బ్రహ్మోత్సవం పేరుతొ భారి డిజాస్టర్ ఇచ్చుకున్నాడు.ప్రెజెంట్ జెనరేషన్ టాప్ హీరోలతో కానిది, మెగాస్టార్ చిరంజీవి ఇలా వచ్చి రాగానే, ఉఫ్ అని ఉదేసినట్టు శ్రీమంతుడు రికార్డులని బద్దులు కొట్టేసారు.ఇదంతా చూస్తోంటే, ఇంద్ర సినిమాలోని, “రాననుకున్నారా … రాలేననుకున్నారా” అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది కదూ.ఆ ఇంద్రసేనుడు ఖైది నం 150తో నాన్ బాహుబలి రికార్డులు అందుకున్నాడు.దాన్ని బ్రేక్ చేసేందుకు పవన్ కాటమరాయుడు అంటూ వచ్చాడు.
యావరేజ్ టాక్ తో మొదలైన సినిమా ఇపుడు మరో భారి ఫ్లాప్ దిశగా నడుస్తోంది.60 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లతో కాటమరాయుడు బాక్సాఫీస్ పరుగుని ఆపేయనుంది.ఈరకంగా పవన్ అటు ఖైది ని దాటలేక, ఇటు కనీసం శ్రీమంతుడు దరిదాపుల్లోకి రాలేక రెండోవసారి చతికిలపడ్డాడు.మరి ఖైది రికార్డులు బద్దలు కొట్టేదెవరు ? బాహుబలి, ఖైది నం 150 చిత్రాల తరువాత 100 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టేది ఎవరు ?
మహేష్ బాబు, ఎన్టీఆర్.వీరికే ఆ సత్తా ఉంది.మరి వీరిద్దరిలో ఎవరు బ్లాక్ బస్టర్ కొడతారో, ఎవరు ఖైదీ నం 150 రికార్డులు బద్దలు కొట్టి, నెం 1 స్థానంపై పూర్తీ అర్థత మెగాస్టార్ ది మాత్రమే కాదు, పోటిలో నేను కూడా ఉన్నాను అని ఒక స్టేట్ మెంట్ వదులుతారో చూడాలి.
మహేష్ బాబు తదుపరి సినిమా జూన్ 23 న వస్తోంటే, ఎన్టీఆర్ కొత్త సినిమా ఆగష్టులో విడుదల కానుంది.