రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్, ఇండియాకు సంబంధించిన ఎంతో రహస్య సమాచారాన్ని, సున్నితాంశాలను బయటకు పంపుతున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరో సంచలన ఆరోపణతో మీడియా ముందుకు వచ్చారు.
ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్ హోదాలో కొనసాగింరాదని, తక్షణం పదవి నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన రెండవ లేఖలో ఆరోపించారు.ఓ ప్రభుత్వ అధికారి అయ్యుండి కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఉదాహరణకు దేశంలో అసహనం పెరిగిందని ఆయన పలుమార్లు అన్నారని గుర్తు చేశారు.
ఆయన జాతి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపించారు.కాగా, ఈ విషయంలో చర్చ జరుగుతోందని, అయితే, వ్యక్తిగత విమర్శలను మాత్రం తాను ఖండిస్తానని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.