నందమూరి బాలకృష్ణ – రాంగోపాల్ వర్మ కాంబోలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోందని అనగానే తెలుగు సినీజనాలతో పాటు ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు అవాక్కైపోయారు.వామ్మో ఇదేం కాంబినేషన్.
అసలు వీళ్లిద్దరికి ఎలా సెట్ అవుతుందని బుర్ర బద్దలు కొట్టుకున్నారు.రాంగోపాల్ వర్మ గతంలో ఏదేదో చేస్తానని ఎన్నో కబర్లు చెప్పాడు.
వర్మను జనాలు పట్టించుకోవడం మానేశారు.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ మీద వర్మ ప్రకటన చేయడం, దానికి తోడు బాలయ్య కూడా ఉండడంతో ఎన్టీఆర్ బయోపిక్పై జనాలు సీరియస్గానే కాన్సంట్రేషన్ చేశారు.
అయితే ఈ బయోపిక్ స్టోరీ వర్మ-బాలయ్యకు అప్పటికప్పుడు వచ్చింది కాదట.బాలయ్య – వర్మ గత మూడు నెలలుగా తరచూ కలుస్తూ ఉంటున్నారట.
మురళీ మోహన్ అల్లుడు విష్ణు ఇందూరికి ఎప్పటి నుంచో.సినిమాలవైపు రావాలని కోరికగా ఉందట.
ఎన్టీఆర్ కథను వెండితెరపై చూపించాలని డిసైడ్ అయిన విష్ణు ఎన్టీఆర్ చరిత్రలోని కీలకాంశాలతో పాటు రొమాంటిక్ ఘట్టాలను పేర్చి ఒకే కథగా రాసుకున్నాడట.
విష్ణుకు ఈ విషయంలో ప్రముఖ దర్శకుడు దేవ కట్టా కూడా హెల్ఫ్ చేశాడట.
బాలయ్య హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించాలన్న ప్రయత్నాలు జరిగాయి.దేవ కట్టా దర్శకుడు అయితే ఈ సినిమాకు అంత క్రేజ్ ఉండదేమోనని ఆయన పేరును పక్కన పెట్టేశారు.
ఆ తర్వాత బాలయ్యే ఈ సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నాడు.డైరెక్షన్ పరంగా అంత అనుభవం లేకపోవడంతో బాలయ్య వెనక్కు తగ్గాడు.
చివరకు ఈ క్రేజీ ప్రాజెక్టు అటు ఇటూ తిరిగి బయోపిక్ల స్పెషలిస్టు అయిన వర్మ చేతికే చిక్కింది.బాలయ్య – పూరి పైసా వసూల్ సెట్లోనే వర్మ – బాలయ్య మీట్ అవ్వడం, ఎన్టీఆర్ బయోపిక్ గురించి చర్చించడం జరిగాయట.
ఏదేమైనా వర్మ బయోపిక్ను తెరకెక్కించడం వెనక బాలయ్య అల్లుడు, ఏపీ మంత్రి లోకేశ్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఇదే విషయాన్ని ఆయనే ఒప్పుకున్నారు.
అయితే ఆయన వర్మ డైరెక్టర్ అన్నది ఇంకా అనుకోలేదని చెప్పారు.