నిన్న ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ఏర్పడబోతున్న తుళ్ళూరు ప్రాంతంలో పంట పోలల్లో జరిగిన అగ్ని ప్రమాధం రాజకీయ రంగు పులుముకుంది.పంట పోలాల్లో ఉన్న గుడిసెలు తగల పడటం…దాదాపు ఒక లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం ఏర్పడటం, అంతేకాకుండా ఈ ఘాతుకం రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల ప్రాంతంలో ఉండటంతో అందరూ ముందుగా ప్రభుత్వాన్ని నిందించారు.
తప్పు చేసిన వారు సైతం తమ తప్పును కప్పి పుచ్చుకునే లా ప్రభుత్వంపైనే బురద జల్లె ప్రయత్నం సైతం చేశారు.ఇక ప్రభుత్వం దీనిపై దర్యాప్తుకు కేంద్రానికి లేఖ రాసింది.
అయితే దీనిపై ప్రభుత్వం సైతం ఎదురు దానికి దిగింది.జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నాడు అని, రాజధానిని తరలించేందుకే ఈ పిచ్చి పనులు చేస్తున్నాడు అని, జగన్ అండ చూసుకునే వైకాపా నేతలు ఈ దుశ్చర్యలకు పాల్పడుతూ ప్రజలను భయపెడుతూ ఉన్నారని ప్రభుత్వం తరపున పత్తిపాటి పుల్లారావు విమర్శించారు.
ఏది ఏమైనా నష్ట పోయింది సామాన్యుడు.