ఇటీవల ఉన్నట్టుండి.జూనియర్ ఎన్టీఆర్ మరోసారి సెంటరాఫ్ది న్యూస్ అయిపోయాడు.
సాధారణంగా ఏ మూవీ ఫంక్షనో అయితే ఇలా చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు.కానీ, అనూహ్యంగా ఎన్టీఆర్ ఓ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నాడని, దీనికి సంబంధించిన లెటర్ హెడ్లతో హల్చల్ సృష్టించారు.
అదికూడా ఏపీలో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన సయమంలోనే ఇదంతా జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.దీంతో అందరి దృష్టీ జూనియర్పై పడింది.
వాస్తవానికి 2009 ఎన్నికల్లో చంద్రబాబు తరఫున, టీడీపీకి భారీ ఎత్తున ప్రచారం చేసి పెట్టాడు ఎన్టీఆర్.ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు.
కానీ, అదేసమయంలో నారా వారి వంశానికి చెందిన లోకేష్ మాత్రం పార్టీలో అధికారిక పదవులు చేపట్టాడు.నిజానికి ఎన్టీఆర్ మాదిరిగా లోకేష్ ఏనాడూ ప్రచారం కూడా చేయలేదు.
అయినా కూడా చంద్రబాబు లోకేష్కి పార్టీలోనే కాకుండా మంత్రి పదవిని కూడా కట్టబెట్టాడు.దీనిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
కానీ, ఎన్టీఆర్నే టార్గెట్ చేసుకుని ఇలా ప్రచారం చేయడం వెనుక ఏముందనేది అర్థం కావడం లేదు.
ఒక వర్గానికి, తెలుగు దేశం పార్టీకి ఎన్టీఆర్ని దూరం చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు.
ఇక ఇప్పుడు మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోనే ఎన్టీఆర్ రాజకీయ పార్టీ అంటూ ప్రచారం లేపారు.నవభారత్ నేషనల్ పార్టీ వాళ్ళను ఎన్టీఆర్ మనుషులు అప్రోచ్ అయ్యారని చెప్పి వార్తలు ప్రచురించారు.
ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ పేరు ఉన్న లెటర్ హెడ్ని సాక్ష్యంగా చూపించారు.
ఎన్టీఆర్లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి గురించి వార్త ప్రచురించేటప్పుడు ఆయన అభిప్రాయం తీసుకోరా? అయినా ఇక్కడ అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఏముంది? ఒకవేళ పార్టీ స్థాపించి, రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే ఆ విషయం మీడియా వాళ్ళకు తెలియకుండా ఉంటుందా? అయినా ఎందుకు దుష్ప్రచారం చేశారు? రేపు ఇంకెవరో నా పార్టీకి ఎన్టీఆరే అధ్యక్షుడు అంటే మళ్ళీ హంగామా మొదలెడతారా? ఎన్టీఆర్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ప్రస్తుతం ఈ విషయాలే జూనియర్ అభిమానులను కలవర పరుస్తున్నాయి.