సినిమా ఇండ్రస్టీ అంటేనే ఓ మాయా జగత్తు.ఇక్కడ హిట్లు పడితే ఎవరైనా సింగిల్ నైట్లో స్టార్లు అయిపోవచ్చు.
ఒక్క సినిమా హిట్ అయితే ఎంత ఎత్తుకు వెళ్లిపోతారో.ఒక్క ప్లాప్ పడితే అంతే కిందకు వచ్చేస్తారు.
ఇందుకు ఎవరో కాదు పూరి జగన్నాథే పెద్ద ఉదాహరణ.ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుసగా హిట్లు ఇచ్చిన పూరి…ఇప్పుడు వరుస ప్లాపులు ఇస్తున్నారు.
దీంతో పూరికి ఛాన్సులు ఇచ్చేందుకే కాదు.కనీసం ఆయనతో మీట్ అయ్యేందుకే స్టార్ హీరోలు ఇష్టపడని స్టేజ్కు ఆయన దిగజారిపోయారు.
హీరోలకు, హీరోయిన్లకు, దర్శకులకు కోట్లలోనే ఫ్యాన్స్ ఉంటారు.మరి అంత టాప్ పొజిషన్లో ఉన్న వాళ్లు ఎంత ఆదర్శంగా ఉండాలి.
అయితే కోట్లాది మందికి ఆదర్శంగా ఉండేవాళ్లు ఎలా ఉండాలి.కానీ మన టాలీవుడ్ సెలబ్రిటీలు చేస్తోందేంటి ? తాజా డ్రగ్ ఉదంతం టాలీవుడ్ పరువును బజారుకి ఇడ్చేసింది.ఇక తాజా ఉదంతంలో ఎక్సైజ్ అధికారులు ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్ఖాన్, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామేన్ శ్యాంకే నాయుడు, హీరోలు నవదీప్, తరుణ్, తనీష్, కేరక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.
వీరికి నోటీసులు జారీ చేసిన అధికారులు టాలీవుడ్లో కొందరు బడా నిర్మాతల వారసులను వదిలేయడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ను శాసించే ఇద్దరు బడా నిర్మాతల వారసులకు డ్రగ్స్ అలవాటు ఉందన్నది ఓపెన్ సీక్రెట్.ఓ బడా నిర్మాత ఇద్దరు కుమారులు డ్రగ్ ఎడిక్టేలేనట.ఇక మరో బడా నిర్మాత పెద్ద కుమారుడు ఓపెన్గానే ఒకటి రెండుసార్లు రచ్చ రచ్చ చేశాడు.తాజా లిస్టులో వారి పేర్లు కూడా ఉన్నా.
వారికి ముందుగానే ఈ ఉందంతం లీక్ అవ్వడంతో వారు జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది.వీరు ముగ్గురు హీరోలే కావడం విశేషం.
మరోవైపు ఎక్సైజ్ అధికారులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తాము ఎంతో కష్టపడి పలువురు ప్రముఖులను డ్రగ్స్ ఇష్యూలో నిందితులుగా గుర్తిస్తే వారిలో కొందరికి మాత్రమే నోటీసులు జారీ చేయడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక టాలీవుడ్ పెద్దలు తమ వారసులకు సైతం ఇందులో ప్రమేయం ఉన్నా వారు డ్రగ్స్ వాడే వాళ్ల వల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందంటూ నీతులు చెప్పడం మరీ విడ్డూరంగా ఉందని ఇండస్ట్రీలోనే కొందరు వాపోతున్నారు.కేవలం చిన్న చేపలనే టార్గెట్ చేసి పెద్దవాళ్లను వదిలేయడంపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.