విదేశీ పర్యటన చేస్తున్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో , ఏం చేస్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి.ఆయన పర్యటన విషయం కుటుంబం తో పాటు పార్టీ వర్గాలు కూడా చాలా సైలెంట్ గా తమలోనే దాచి పెట్టుకున్నాయి.
బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్నప్పుడు రాహుల్ ఎవ్వరికీ చెప్పకుండా, తన నియోజికవర్గ ప్రజలకి కూడా సమాధానం చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళడానికి లేదు.
ఇప్పుడు దీన్ని అలుసుగా తీసుకున్న బీజేపీ రాహుల్ మీద రెచ్చిపోతోంది.
రాహుల్ ఎక్కడ ఉన్నాడు అనే సమాచారం ఇస్తే లక్ష రూపాయల రివార్డు ఇస్తాను అని ప్రకటించారు మధ్య ప్రదేశ్ బీజేపీ నాయకుడు ఒకరు.నలభై ఆరు ఏళ్ళ వయసు లోకి ఈ మధ్యనే అడుగు పెట్టిన రాహుల్ విదేశాలకి వెళ్లారు అని తప్ప ఇంకేమీ తెలియనివ్వడం లేదు కాంగ్రెస్ వారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి పర్యటనపై ప్రత్యర్థులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే మధ్యప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి విరేంద్ర సింగ్ సిసోడియా ఒకడుగు ముందుకేసి రాహుల్ సమాచారం తెలిపితే అక్షరాల లక్షరూపాయలు రివార్డుగా ఇస్తానని ప్రకటించారు.
మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ చైర్మన్ గా ఉన్న సిసోడియా‘రాహుల్ ఏ దేశంలో ఉన్నారు? ఆయనకు సంబంధించి సమాచారం ఉంటే ఇవ్వండి.నా జేబులోంచి లక్ష రూపాయలు ఇస్తాను’ అని ప్రకటన చేశారు.
రాహుల్ గత విదేశీ పర్యటనలపైనా ఆయన సెటైర్లు వేశారు.