శ్రీమంతుడు మహేష్ బాబు లో నూతన ఉత్సాహాన్ని నింపింది.రెండు’ వరస పరాజయాల తరువాత అఖండ విజయాన్ని అందుకున్నారు మహేష్.అదే ఊపులో ఇప్పుడు బ్రహ్మోత్సవం ఈ నెల చివరాఖరులో ప్రారంభించనున్నారు.
అయితే మహేష్ బ్రహ్మోత్సవం తరువాత ఏ సినిమా మొదలుపెడతారు అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు.
మహేష్ వెనకాల లైన్ మాత్రం పెద్దగానే ఉంది.రాజమౌళి,త్రివిక్రమ్, పూరి జగన్నాధ్, వినాయక్, మురగదాస్.
ఈ దర్శకులందిరితో మహేష్ సినిమాలు చేయాల్సి ఉంది.త్రివిక్రమ్,పూరి ఇప్పటికే కథ చర్చలు కుడా జరిపారు.
రాజమౌళి సినిమా ఎలాగో ఇప్పట్లో ఉండదు.బాహుబలి రెండో భాగాన్ని పూర్తీ చేసి, మహేష్ కోసం పక్కాగా కథ సిద్ధం చేసుకోని, సినిమా షూటింగ్ మొదలుపెట్టేవరకు ఇంకో రెండు సంవత్సారాలు పట్టినా పట్టొచ్చు.
ఇక మిగిలింది మురగదాస్, వినాయక్.మురుగదాస్ తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీసేందుకు యత్నాలు చేస్తున్నారు.
ఇంకా కథ చర్చలు జరిగినట్టుగా సమాచారం లేదు.వినాయక్ అఖిల్ తరువాత మరో సినిమా ప్రకటించలేదు.
ఇప్పటికే ప్రొడ్యుసర్ తో సహా రెడిగా ఉన్నారు వినాయక్.
గజిబిజి గా ఉంది కదా .ఏ సినిమా ఎప్పుడు మొదలుపెట్టినా , 25వ సినిమా మాత్రం రాజమౌళితో ఉండేలా ప్లాన్ చేస్తున్నడటా సూపర్ స్టార్.