మన ఇంట్లోనో, పక్కింట్లోనో, మన చుట్టాల్లోనో ఎవరో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతుండటం చూస్తుంటాం.నేటి లైఫ్ స్టయిల్ లో చాలా సర్వసాధరణమైన సమస్యగా మారిపోయింది మధుమేహం.
ఈ సమస్యతో బాధపడేవారు తమ ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాలి.ముఖ్యంగా అల్పాహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అసలు ఒక షుగర్ పేషెంట్ బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలంటే …
* బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు ఖచ్చితంగా కలిగి ఉండాలి.బ్రేక్ ఫాస్ట్ అంటేనే 8-10 గంటలు ఉపవాసం చేసి, ఏదైనా తినటం.
బ్రేక్ ఫాస్ట్ ని పట్టించుకోకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి.
* అరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.
బయటకెళ్ళి క్వాలిటి లేని నూనెతో, పిండితో హోటల్ వారు చేసే వంటకాలు తినటం కాదు, ఇంట్లోనే మంచి అల్పాహారం ప్రపేర్ చేసుకోవాలి.
* షుగర్ కంటెట్ ఎక్కువగా ఉండే పదార్థాలను ముట్టకూడదు.
అలాగే ఫ్యాట్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.
* తాజా పండ్లు (షుగర్ కంటెంట్ తక్కువ ఉన్నవి), కూరగాయలు తీసుకోవాలి.
* ఆపిల్స్, అవకాడో, ఓట్ మీల్ .ఇవి ఉదయాన్నే తీసుకుంటే రోజంతా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెట్టొచ్చు.
* నాణ్యమైన పెరుగు.అంటే ఎలాంటి ఫ్లేవర్స్ కలపని పెరుగుని తీసుకోవాలి.
* ఉదయాన్నే పండ్ల రసాన్ని తాగే బదులు, డైరెక్టుగా పండ్లు తినాలి.జ్యూస్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
* ఫైబర్ దొరికే పదార్థాలు, ఫ్యాట్ లేని పాలు, దాల్చిన చెక్క పొడిని చేర్చిన షుగర్ లెస్ టీ లేదా కాఫీని ఉదయాన్నే సేవించవచ్చు
.