హాట్ యాంకర్ రష్మీ వరుస ఫ్లాపులని లెక్క చేయకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది.మొన్నటికి మొన్నే అంతం అనే సినిమా విడుదలవగా, నిన్న మరో సినిమా తను వచ్చెనంట ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న రష్మీ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.
గుంటూరు టాకీస్ తరువాత రష్మీ దగ్గరకి ఐటమ్ సాంగ్స్ చేయమని చాలామంది వచ్చారట.
కాని పెద్ద హీరోల నుంచి, పెద్ద బ్యానర్ల నుంచి అలాంటి ఆఫర్లు రాకపోవడంతో ఒప్పుకోలేదట రష్మీ.ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఐటమ్ సాంగ్ చేయాలంటే, పేరున్న హీరో లేదా పేరున్న బ్యానర్ సినిమాలోనే చేస్తుందట.
ఇక తన బాగా బాధపెట్టిన రూమర్ తనపై వచ్చిన వ్యభిచారం ఆరోపణలంట.ఆ నిందలు మోయడం చాలా కష్టంగా అనిపించదట.
ఇక తనకి సుడిగాలి సుధీర్ కి ఎలాంటి ఆఫైర్ లేదని, మీడియా అలాంటి గాసిప్పులు రాసినా, వచ్చే ఇబ్బంది ఏమి లేదని చెప్పింది రష్మీ.