రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన చిత్రం ‘గంగ’.ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
ఇక ఈ సినిమా ప్రమోషన్లో ఎక్కువగా తాప్సి కనిపిస్తోంది.అయితే ఈ సినిమాలో నిత్యామీనన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించింది.
కాని నిత్యా మీనన్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా కనిపించడం లేదు.దానికి కారణం వారిద్దరి మద్య ఉన్న వైరం అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సినిమా షూటింగ్ సమయంలో రాఘవ లారెన్స్కు నిత్యామీనన్కు పదే పదే గొడవ జరిగేదని, ఇద్దరు కూడా పలు విషయాల్లో విభేదించే వారని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.రాఘవ లారెన్స్ పలు సార్లు రీ టేక్ చేసేవారని, అది నిత్యామీనన్కు నచ్చేది కాదని, కొన్ని సార్లు షూటింగ్ స్పాట్ నుండి అర్థాంతరంగా కూడా వెళ్లి పోయిందని అంటున్నారు.
అందుకే నిత్యామీనన్ పాత్రను ఈ సినిమాలో పరిమితం చేశాడని, ముందుగా అనుకున్న ప్రకారం అయితే తాప్సి కంటే కూడా ఎక్కువగా నిత్యామీనన్ పాత్రకు ప్రాముఖ్యత ఉండేదని గుసగులు వినిపస్తున్నాయి.ఆ విభేదాల వల్లే ప్రమోషన్ కార్యక్రమాల్లో అటు తమిళం మరియు ఇటు తెలుగులో కూడా పాల్గొనలేదు.