బాలీవుడ్లో క్రేజీగా ఉన్న బయోపిక్ ల హవా ధోని హిట్ తో ఇంకాస్త ఊపందుకున్నాయని చెప్పాలి.రీసెంట్ గా నీరజ్ పాండే డైరక్షన్ లో రిలీజ్ అయిన ఎం.
ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ సూపర్ సక్సెస్ అవడంతో పాటుగా రికార్డ్ కలక్షన్స్ సాధిస్తుంది.అయితే ధోని సినిమా వచ్చింది మరి ఎప్పటి నుండో నలుగుతున్న సచిన్ బయోపిక్ పరిస్థితి ఏంటి ఆ సినిమా ఎందాకా వచ్చింది అన్నది అందరు ఆరా తీస్తున్నారు.
సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ అని మొదలు పెట్టిన ఆ సినిమాలో సచినే హీరోగా చేస్తున్నాడు.అంతేకాదు ఆ సినిమా కథ నేరేట్ చేసింది కూడా సచినే.
సినిమాలో సచిన్ నెలకొల్పిన రికార్డులు.హిస్టరీ మొత్తం గుర్తుచేస్తుందట.
బ్రిటన్ కు చెందిన జేమ్స్ ఎర్స్కిన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.మరి భారతీయ క్రికెట్ దేవుడుగా అభిమానాన్ని చోరగొన్న సచిన్ ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తాడో చూడాలి.
క్రికెట్ చూసే ప్రతి ఒక్క అభిమాని సచిన్ బయోపిక్ చూసేందుకు ఇష్టపడతాడు.
.